Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు.
సీఎం సూచించిన కీలక అంశాలు:
అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంటనే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ నగర దిశగా ప్రణాళికలు:
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro), రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ తదితర అంశాలపై పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక సమగ్ర పాలసీ రూపొందించాలని సూచించారు. “పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 ఏళ్ల దృష్టితో ప్రణాళికలు అవసరం,” అని సీఎం స్పష్టం చేశారు. కోర్ అర్బన్తో పాటు సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక విధానం రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, MA&UD కార్యదర్శి ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, FCDA కమిషనర్ కె. శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, MRDCL ఎండీ ఈవి నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.