Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు
ఈ రైలుకు అదనపు కోచ్లను జోడించనుంది. జనవరి 13, 2025 నుంచి అందుబాటులోకి వచ్చాయి. డిమాండ్కు అనుగుణంగా ప్రయాణీకుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్లో మొదట 8 కోచ్లతో 530 మంది ప్రయాణించే వీలు ఉంది. అయితే ఇపుడు 16 కోచ్లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు X లో పేర్కొన్నారు.
“2024 మార్చి 12న ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేసిన సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఆక్యూపెన్సీతో నడుస్తోంది. 8 కోచ్లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) నడుస్తున్న రైలును ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 16 కోచ్ల (1,128 ప్రయాణీకుల సామర్థ్యం)వరకు పెంచినట్లు పేర్కొంది.
రైలు నంబర్లు. 20707/20708 సికింద్రాబాద్ – విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ( Secunderabad–Visakhapatnam Vande Bharat Express) ప్రారంభంలో 8 కోచ్ల కూర్పుతో ప్రవేశపెట్టబడింది, ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్. 07 చైర్ కార్లు ఉన్నాయి. “రెగ్యులర్ సర్వీసులను ప్రవేశపెట్టినప్పటి నుంచి, రైలు నెం. 20707 సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 145 శాతానికి పైగా ఆక్యూపెన్సీతో రైలు నంబర్. 20708 విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 159 శాతానికి పైగా ఆదరణతో నడుస్తోంది. ఏప్రిల్ – డిసెంబర్ 2024” అని రైల్వే అధికారులు తెలిపారు.
కొత్త కంపోజిషన్లో 1,024 కెపాసిటీతో 14 చైర్ కార్లు (గతంలో 478 కెపాసిటీ ఉన్న 07 కోచ్లకు బదులుగా), 104 కెపాసిటీతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ (అంతకుముందు 52 కెపాసిటీ ఉన్న 1 కోచ్కు బదులుగా) ఉంటాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సామర్థ్యం పెంపు”