Shocking Incident in Punjab | ఓ టీనేజ్ యువకుడిపై నలుగురు యువతులు లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో దేశంలో అమ్మాయిల భద్రతకే కాదు.. ఇక మీదట అబ్బాయిల భద్రత కూడా పెనుసవాల్ గా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో ఈ యువతులు మద్యం మత్తులో ఒక టీనేజ్ యువకుడిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటన పంజాబ్లోని జలంధర్లో చోటుచేసుకుంది.
రాత్రంతా కారులో తిప్పుతూ అతనిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. నగర శివార్లలో పొదల్లోకి తీసుకెళ్లి అతనిపై లైంగికత దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని వదిలేసి పరారయ్యారు. మరుసటి రోజు అతను పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామంధులు మారడంలేదు. మహిళలపై జరిగే నేరాలతో పాటు ఇటువంటి ఘటనలు కూడా బయటపడుతుండడం సమాజంలో యువకుల భద్రతపై ఆందోళనలు పెంచుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







