Sarkar Live

మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway

Warangal : ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై

South Central Railway

Warangal : ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై నిలిచి ఉన్న రైళ్లలో ప్రయాణికుల వద్దకు నేరుగా రైల్వే సిబ్బంది నీళ్లు తెచ్చి ఇస్తున్నారు. దీంతో రైల్వే శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలంగాణలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులకు తాగునీటి వసతులు కల్పిస్తున్నారు

మరోవైపు రైల్వేల భద్రత విషయమై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ ప‌రిధిలో ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌ధాన రైల్వే స్టేష‌న్‌లైన సికింద్రాబాద్, కాచిగూడ‌లో భారీ భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్య‌ను సైతం పెంచి ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న‌ట్లు శ్రీధ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌తి ప్ర‌యాణికుడిని, వారి ల‌గేజీని క్షుణ్ణంగా త‌నిఖీలు చేసిన త‌ర్వాత స్టేష‌న్‌లోకి అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!