Supreme Court stay : ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మహిళ ఛాతీని తాకడం గానీ, ఆమె పైజామా తాడును లాగడం గానీ చేస్తే అది నేరం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రోజు ప్రకటించింది.
అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే..
ఒక మహిళను బలవంతంగా నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం దాడిగా పరిగణించాలి గానీ దాన్ని అత్యాచారంగా భావించలేమని ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు మార్చి 17న తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మహిళా భద్రతకు విఘాతం కలిగించే తీర్పు అని, ఇది నిందితులను రక్షించేలా ఉందని న్యాయ నిపుణులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజికవేత్తలు అభ్యంతరం చెప్పారు.
మానవ విలువలకు విరుద్ధంగా తీర్పు : Supreme Court stay
హైకోర్టు వెలువరించిన అభ్యంతకర తీర్పు వెలువరించడంతో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటా ( suo motu)గా తీసుకుంది. న్యాయమూర్తులు బి.ఆర్. గవాయి, ఆగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన ధర్మాసనం (bench of Justices B R Gavai and Augustine George Masih ) హైకోర్టు తీర్పును సమీక్షించింది. ఇది పూర్తిగా అసమంజసంగానూ, మానవ విలువలకు విరుద్ధంగానూ ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మహిళల హక్కులను గౌరవించాల్సిన న్యాయవ్యవస్థే ఇలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి కోర్టులు జాగ్రత్తగా తీర్పు ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
Supreme Court : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Centre), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government)తో పాటు సంబంధిత అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థనీయం కాదని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..