ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ సర్కారు నిర్ణయం | Primary schools
AI Primary schools in Telangana | విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టగా కొత్తగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయబోతోంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల (Primary schools) విద్యార్థుల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధస్సు (Artificial intelligence (AI)ను చేర్చాలని విద్యా శాఖ (Education department) నిర్ణయించుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (academic year) నుంచి ఇది అమల్లోకి రానుంది.
AI in Primary schools : ఏయే క్లాసులు అంటే..1
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తున్న కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు (primary students) కంప్యూటర్తో పాటు AI, డిజిటల్ రంగంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకోనున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆధునిక టెక్నాలజీపై...

