Micro Finance loan | ఇంత దారుణమా..?!.. దంపతులను బలిగొన్న మైక్రో అప్పు
Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు భార్యాభర్తలు బలి అయ్యారు. బలవన్మరణం చేసుకొని పిల్లలను అనాథలు చేశారు. పది రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వారం వారం చెల్లింపులతో కష్టాలు
భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవందర్ (37), చందన (32) అదే గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాలని దినసరి వేతనంతో వీరికి కుటుంబ పోషణ భారమైంది. దీంతో మైక్రో ఫైనాన్స్లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు కట్టాల్సి ఉండగా, కొన్ని రోజుల తర్వాత చెల్లింపులు వీరికి కష్టతరమైంది.
ఒకరి త...