Telangana Formation Day 2025 | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ (secunderabad parade ground) లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది.
Telangana Formation Day 2025 Shedule
- 09:40 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో పరేడ్కు సిద్ధం
- 09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్ బాధ్యతలు స్వీకరిస్తారు
- 09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు
- 09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు.
- 09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు.
- 10:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు . జాతీయ గీతం ఆలాపన – పోలీసు బ్యాండ్
- 10:01 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన
- ముఖ్యమంత్రి ఎదుట పోలీస్ల కవాతు వందన సమర్పణ
- 10:04 గంటలకు ముఖ్యమంత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వందన సమర్పణ వేదిక వద్దకు తోడ్కొని వెళతారు.
- 10:05 గంటలకు పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రికి నివేదన
- 10:17 గంటలకు ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీపులో కవాతును పరిశీలిస్తారు. DGP, పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రితో పాటు వెళతారు
- 10:17 నుంచి 10:40 గంటల వరకు కంటింజెంట్ల ద్వారా మార్చ్ పాస్ట్
- 10:40 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు
- 11:00 గంటలకు తొమ్మిది మంది ప్రముఖ వ్యక్తులు/కుటుంబ సభ్యులకు నగదు పురస్కారం ప్రదానం.
- 11:15 గంటలకు పోలీసు సిబ్బందికి అవార్డుల ప్రదానం:
- 19మందికి శౌర్య పతకం-
- ఇద్దరికి విశిష్ట సేవా పతకం 2
- 11మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకం
- ఉత్తమ దళాలకు బహుమతులు ప్రదానం.
- 11:20 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో అవార్డు గ్రహీతల ఫోటో
- 11:30 గంటలకు ముఖ్యమంత్రి వేదిక నుంచి బయలుదేరివెళతారు..