Sarkar Live

Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్

Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా

Telangana power

Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం, మే 16న ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు విద్యుత్ శాఖ ఈ విషయం గురించి వివరించింది. 2034 – 2035 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లు ఉండవచ్చని అంచనా వేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రం (Data Centers )గా మారుతున్న దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటును ప్రకటించింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలో సౌర విద్యుత్ (Telangana Solar Power) ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో నిర్మించనున్న రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఇంధన అవసరాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)తో సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Telangana power : ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్

“విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ ఆధునీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ(Future City)లో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, స్తంభాలు, విద్యుత్ సరఫరా లైన్లు ఉండకూడదు. అక్కడి నుండి హై టెన్షన్ లైన్లను కూడా తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోని 160 కి.మీ.ల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. క్లీనర్ విద్యుత్ ఉత్పత్తి కోసం GHMC పరిమితుల్లోని ఫుట్‌పాత్‌లు, నాలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో, గ్రేటర్ హైదరాబాద్ (GWMC) ప్రాంతంలో ప్రయోగాత్మక ప్రాతిపదికన స్మార్ట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కెబిఆర్ పార్క్ వద్ద ఈ స్మార్ట్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!