కాళేశ్వరం పుష్కరాల్లో ఆకట్టుకుంటున్న టెంట్ సిటీ
Saraswathi Pushkaralu 2025 | సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం (Kaleshwaram) లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కొన్ని నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) మార్గనిర్దేశంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్కర ఘాట్లకు సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వారం పాటు మూడు షిఫ్టుల్లో 100 మంది కార్మికులు శ్రమించి అధునాతన వసతులతో కూడిన 40 అద్దె గదులను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ బస చేసిన వారి సౌకర్యార్థం డైనింగ్ హాల్, ప్రత్యేక ఫుడ్ కోర్టును అందుబాటులోకి తెచ్చారు. 200 మంది సేద తీరేలా ప్రత్యేకంగా డార్మిటరీని కూడా ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.