Sarkar Live

Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు

Tibet earthquake : టిబెట్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించింది. దీంతో 95 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం

Tibet earthquake

Tibet earthquake : టిబెట్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించింది. దీంతో 95 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు (జీఎంటీ 01:00) జ‌రిగింది. టిబెట్‌ (Tibet) పవిత్ర నగరం శిగత్సే వద్ద సంభవించింది. దీని తీవ్రత 7.1గా న‌మోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో (6 మైళ్ల లోతు) ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ప్రాంతంలో పలు ఆఫ్టర్‌షాక్స్ (అనంతర ప్రకంపనలు) కూడా నమోదయ్యాయి. ఇవి పొరుగు దేశాలైన నేపాల్ (Nepal), భారత్‌ (India)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా క‌నిపించాయి.

Tibet earthquake : పవిత్ర నగరం శిగత్సే

శిగత్సే టిబెట్‌లో పవిత్ర నగరం. ఇది పాంచెన్ లామా అనే ముఖ్యమైన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు స్థానం.
టిబెట్‌ను చైనా (China) 1950లో ఆక్రమించింది. అనంత‌రం అక్క‌డి జ‌నం అనేక ఆంక్ష‌ల మ‌ధ్య జీవిస్తున్నారు. శిగత్సేలో ఒక హోటల్ నివాసి మాట్లాడుతూ భూకంప ప్రకంపనల కారణంగా పడక కూడా లేచిపోయినట్లు అనిపించిందని చెప్పారు. తాను వెంటనే రోడ్డుపైకి పరుగెత్తి వెళ్లానని తెలిపారు.

భ‌యాన‌క దృశ్యాలు

భూకంపం చైనా ఇటీవల చూసిన ప్రాణాంతక భూకంపాల్లో ఒక‌టిగా చెబుతున్నారు. ఈ భ‌యాన‌క దృశ్యాలు అక్క‌డి సీసీఫుటేజీల్లో న‌మోద‌య్యాయి. వాటిని చైనా ప్రభుత్వం ప్రసారం చేసింది. శిథిలాల మధ్య పడి పోయిన ఇళ్లను, కూలిన పెద్ద‌ భవనాలు, మృతులు, క్ష‌త‌గాత్రుల‌తో అత్యంత హృద‌య విదార‌కంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. భూకంప ప్రాంత‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. విద్యుత్‌, నీటి వ‌న‌రులు సైతం ధ్వంస‌మై స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

పర్యాటక కేంద్రాల‌ మూసివేత

టిబెట్‌లో భూకంపం నేప‌థ్యంలో అక్క‌డి ప‌ర్యాట‌క కేంద్రాల‌ను మూసి వేశారు. ఎవరెస్ట్‌ను సందర్శించే వారి పర్యటనలు రద్దు చేశారు. అక్కడ ఉన్న ముగ్గురు పర్యాటకులను భద్రత కోసం బహిరంగ ప్రదేశానికి తరలించామ‌ని సిబ్బంది తెలిపారు.

తీవ్రత.. భవిష్యత్తు ప్రమాదాలు

Earthquake in Tibet : టిబెట్‌లో మ‌రో 5.0 తీవ్రత కలిగిన ప్ర‌కంప‌న‌లు సంభవించే అవకాశం చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ పరిశోధకుడు జియాంగ్ హైకున్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పెద్ద భూకంపం సంభవించే అవకాశం తక్కువే అన్నారు.

ముమ్మ‌రంగా రక్షణ చర్యలు

భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల కోసం చైనా వైమానిక దళం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు చేప‌ట్టాల‌ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త‌న యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!