VIP Break Darshan : తిరులమ వేంకటేశ్వరస్వామి భక్తులకు (TTD Devotees) టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల (Tirumala)లో 15వ తేదీ గురువారం నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల తిరుమలలో భక్తుల కోలాహలం తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వేసవి సెలవుల్లో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) వెల్లడించారు.
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళలను మార్చింది. ఉదయం వేళ ఉండే ప్రోటోకాల్ దర్శనం, రిఫరల్ ప్రోటోకాల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా సామాన్య భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జూలై 15 వరకూ సిఫార్సు లేఖల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ ముగిసిన తరువాతే సిఫారసు లేఖల్ని పునరుద్ధరించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.