2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు న్యాయవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్ (PGECET), లాసెట్ (LAWCET) కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ రెండు సెట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. లాసెట్ 2025కి సంబంధించి ఈనెల 26న శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4 నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 16, 17వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఉంటాయి. 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి.
ఇక పీజీఈసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి జూలై 26వ తేదీన టిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లకు చాన్స్ ఇవ్వనున్నారు. 11, 12వ తేదీల్లో మొదటి విడతగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18వ తేదీ నుంచి 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.