Sarkar Live

UPI services down | యూపీఐ సేవలకు అంత‌రాయం.. యూజ‌ర్లు బేజారు

UPI services down : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (Unified Payments Interface (UPI) సేవల్లో భారీ అంతరాయం ఏర్ప‌డింది. శనివారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు డిజిటల్ (Digital) లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు (suffered) ఎదుర్కొన్నారు. ఈ

UPI services down

UPI services down : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (Unified Payments Interface (UPI) సేవల్లో భారీ అంతరాయం ఏర్ప‌డింది. శనివారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు డిజిటల్ (Digital) లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు (suffered) ఎదుర్కొన్నారు. ఈ సేవల ద్వారా చేసే షాపింగ్‌, బిల్లు చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వినియోగదారులు తాము పేమెంట్ చేయలేకపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ కనిపించారు.

UPI services down : ఏం జరిగింది?

డిజిటల్ లావాదేవీలపై నిఘా వేసే “Down Detector” అనే వెబ్‌సైట్ ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2,358 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 81 శాతం సమస్యలు పేమెంట్ వ్యవహారాల్లో కాగా, 17 శాతం ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ల‌కు సంబంధించి ఉన్నాయి. ఈ అవాంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.

స్పందించిన NPCI

యూపీఐ (UPI)లో అంతరాయాలు ఏర్ప‌టిన విష‌యాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంగీక‌రించింది. “యూపీఐలో అంత‌రాయం ఏర్ప‌డిన విష‌యం వాస్త‌వమే. కొన్ని లావాదేవిలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఈ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్నాం. వినియోగ‌దారుల‌కు కలుగుతున్న అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం” తెలిపింది. త్వ‌ర‌లోనే ఈ స‌మస్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని పేర్కొంది.

UPI services down : మూడు వారాల్లో మూడోసారి!

యూపీఏ సేవ‌లు నిలిచిపోవ‌డం ఈ నెలలో ఇది మూడోసారి. దీంతో వినియోగ‌దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ (online payment platforms) అన్నీ స్పందించకపోవడం వినియోగదారుల్లో ఆందోళనను పెంచింది. SBI, ICICI, HDFC వంటి ప్రధాన బ్యాంకుల యాప్‌లలో కూడా యూపీఐ సేవలు పని చేయకపోవడంతో ఇది మొత్తం UPI నెట్‌వర్క్ స్థాయిలోని సమస్య అని స్పష్టమవుతోంది.

అవాంత‌రాలు ఎదురైనా పెరిగిన వినియోగం

యూపీఐలో ఈ సమస్యలు ఎదురవుతున్నా దీని వినియోగం మాత్రం త‌గ్గ‌డం లేదు. కొంతకాలంగా విపరీతంగా పెరుగుతోంది. NPCI గణాంకాల ప్రకారం.. యూపీఐ ద్వారా మార్చి 18.3 బిలియన్ లావాదేవీలు (UPI-based transactions) జ‌రిగాయి. ఇది ఫిబ్రవరి లో జరిగిన 16.11 బిలియన్ల కంటే ఇది 13.59 శాతం అధికం. మార్చి మొత్తం లావాదేవీల విలువ రూ. 24.77 లక్షల కోట్లు. ఇది ఫిబ్రవరితో పోల్చితే 12.79 శాతం ఎక్కువ‌. రోజుకు సగటున 590 మిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి. విలువ సుమారుగా రూ. 79,910 కోట్లు. పర్సన్-టు-పర్సన్ (P2P), పర్సన్-టు-మెర్చంట్ (P2M) లావాదేవీల రెండింటిలోనూ UPI విస్తృతంగా విస్తరించింది. పెరిగిన వృద్ధిరేటు, మరింతగా నగదు రహిత సమాజం వైపు భారత్ అడుగులు వేస్తోందన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

సేవ‌ల‌ను మెరుగుప‌ర్చాలంటున్న నిపుణులు

యూపీఐ వంటి సేవలు ఇప్పటికే దేశంలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెరుగైన భవిష్యత్తును సూచిస్తున్నప్పటికీ తరచూ ఎదురవుతున్న టెక్నికల్ ఇష్యూలు, సిస్టమ్ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు మరోసారి డిజిటల్ పేమెంట్స్‌పై నమ్మకం ఉంచాలా? లేదా తిరిగి క్యాష్‌ వైపు మళ్లాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రముఖ ఐటీ నిపుణులు NPCI సేవలను మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ప్రజల నిత్యజీవితంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తున్న క్ర‌మంలో నిరంతర పర్యవేక్షణ, పటిష్టమైన బ్యాకప్ వ్యవస్థలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంద‌ని అంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!