Skip to main content

Sarkar Live

Day: November 26, 2024

Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌
National

Mallikarjun Kharge  | బ్యాలెట్ పేప‌ర్ కోసం మ‌రోసారి జోడో యాత్ర‌

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంల‌కు బ‌దులుగా బ్యాలెట్ పేపర్ కోసం భారత్ జోడో యాత్ర లాంటి ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge ) పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చ‌విచూసిన రెండు రోజులకు ఖర్గే ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు దీనిపై అవగాహన కల్పించడానికి భారత్ జోడో యాత్ర స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తల్కతోరా స్టేడియంలో జరిగిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తారని మోదీ భయపడుతున్నారని అన్నారు. బీజేపీకి రాజ్యాంగ సమగ్రత లేదని ఖర్గే ఆరోపించారు బ...
Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
State

Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

Winter Season | తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి వేళ 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలు నమోదు అయింది. అలాగే న్యాల్కల్‌లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు రికార్డ్ అయింది. ఇదిలా ఉండగా , సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.. సిర్పూర్‌(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయినట్లు అధికారులు తెలిపారు.  సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్య...
Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..
State

Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..

Constitution Day | భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్‌ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనిక దేశానికి దిక్సూచి అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సం సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌వంబర్ 26, 1949న, రాజ్యాంగాన్ని ఆమోదించాలనే నిర్ణయం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చింద‌ని గుర్తుచేశారు. సంవిధాన్ దివస్ సంద‌ర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ‌ విలువలను కాపాడుకోవడంపై దృష్టిసారించాలన్నారు. మ‌హ‌నీయుల‌ ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. Also Read : Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే.. దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ...
Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..
Sports

Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే..

Ipl 2025 News : యూఏఈలోని అబుదాబి వేదికగా ఎంతో ఉత్తేజ‌భ‌రితంగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. ఈసంద‌ర్భంగా వివిధ‌ ఫ్రాంఛైజీలు భారత క్రికెటర్లను కోట్లు కుమ్మ‌రించి కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు భారీగా ధ‌ర‌లు ప‌లికారు. కాగా, 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బ్రేక్ చేసింది. టాప్ వ‌న్‌ పంత్, టాప్- 2 శ్రేయాస్ ఐపీఎల్ యాక్ష‌న్ లో అత్యధిక డిమాండ్ ఉన్న ఆటగాళ్ల లిస్ట్ లో సగం మందికి పైగా టీమిండియా క్రికెట‌ర్లే ఉన్నారు. అంతేకాకుండా మొద‌టి రెండు స్థానాల్లోనూ భారత ఆటగాళ్లే ఉన్నారు. గతేడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో అగ్ర‌స్థానంలో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి రిషబ్ పంత్ అమ్ముడుపోయి ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు. అయ్యర్ కు ఒక్క‌సారిగా క్రేజ్‌.....
Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..
State

Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..

Caste Census in Telangana | తెలంగాణ‌లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 1,17,58,491 నివాసాలు గుర్తించగా, సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. ఈ వివ‌రాల‌నుప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్‌ మల్కజిగిరి 82.3శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఇంటింటి సర్వే పూర్తయింది. అయితే కొంత‌కాలంగా వెనకబడి ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ఊపందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా సోమవారం నాటికి 19,04,977 కుటుంబాల్లో సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరింది. సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమోదు ప్రక్రియ కూడా...
error: Content is protected !!