Skip to main content

Sarkar Live

Day: December 13, 2024

Allu Arjun Bail | జైలుకు కాదు.. ఇంటికే..
Cinema

Allu Arjun Bail | జైలుకు కాదు.. ఇంటికే..

Allu Arjun Bail : హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించగా.. రాష్ట్ర హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్‌ అభిమానులు, అల్లు, మెగా స్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని 34 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను ఏ11 నమోదు చేసి ఈరోజు మ‌ధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలులో విచారణ...
Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు
Crime

Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు

Hanamkonda | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను (Ganja Plants) పెంచాడు తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన సదరు వ్యక్తిని యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. హ‌న్మ‌కొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో నివాసం ఉండే అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసుకున్నాడు. ఇందుకోసం వెంకటనర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల విస్తీర్ణంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమ‌య్యాడు. అయితే.. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు గంజాయి పెంచుతున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందంతో తనిఖీలు చేపట్టగా ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర...
Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
Cinema

Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

Allu Arjun Arrest టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో (Pushpa-2 ) సందర్భంగా జరిగిన తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతిచెంద‌గా మ‌రో బాలుడు తీవ్రంగా గాయాల పాల‌య్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్లారు. అనంత‌రం గాంధీ హాస్పిట‌ల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరు వ‌ర్గాల వాదనలు విన్న త‌ర్వాత మేజిస్ట్రేట్ అల్లూ అర్జున్ కు14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హ...
Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్
Business

Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్

Zomato : ఆహార డెలివ‌రీ, క్విక్ కామ‌ర్స్‌లో అగ్ర‌గామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంద‌ని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్ర‌ల్ ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్‌, అంతే మొత్తంలో వడ్డీ/జ‌రిమానాతో క‌లిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉంద‌ని వివ‌రించింది. 'ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి' అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది. Zomatoకు ఇదేం కొత్త‌కాదు.. డెలివ‌రీ చార్జీల‌పై రావాల్సిన ట్యాక్స్‌కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయ‌డం ఇ...
Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్
Crime

Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్

Atul Subhash suicide case : గృహ హింస‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న అతుల్ సుభాష్ (34) కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. అత‌డి అత్త నిషా సంఘానియా, బావ‌మ‌రిది అనురాగ్ సంఘానియాను క‌ర్ణాట‌క పోలీసులు శ‌క్ర‌వారం అరెస్టు చేశారు. అతుల్ భార్య ప‌రారీలో ఉంద‌ని పోలీసులు తెలిపారు. వేధింపులు త‌ట్టుకోలేక‌... అతుల్ ఆత్మ‌హ‌త్య ప్ర‌పంచ‌మంతా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివాహిత పురుషులు కూడా గృహ హింస‌కు గురువుతున్నార‌నే విష‌యాన్ని ఎత్తి చూపింది. త‌న భార్య, ఆమె కుటుంబం త‌న‌ను డ‌బ్బుల కోసం వేధిస్తున్నార‌ని, రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ మానసిక క్షోభ‌కు గురి చేస్తున్నార‌ని అతుల్ సుభాష్ డిసెంబ‌ర్ 9న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనికి ముందు 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. దీంతోపాటు 90 నిమిషాల వీడియా ద్వారా త‌న భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబం త‌న‌ను ఎలా వేధించారో వివ‌రించాడు. నా అస్తిక‌లు కాలువ‌లో క‌ల‌పండి అతుల్ తన సూసై...
error: Content is protected !!