Skip to main content

Sarkar Live

Day: January 6, 2025

HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు న‌మోదు
State

HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు న‌మోదు

చైనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్ర‌మేణా విస్త‌రిస్తోంది. బెంగళూరులో మానవ మెటాప్న్యుమో వైరస్ (HMPV) రెండు కేసులు నమోద‌య్యాయి. భారతదేశంలో హెచ్ఎంపివి వైరస్ మొదటి కేసులు ఇవే. ఎనిమిది, మూడు నెల‌ల‌ ఇద్ద‌రు శుశువులు దీని బారిన ప‌డ్డారు. ఎనిమిది నెలల శిశువు చికిత్స పొందుతుండ‌గా, మూడు నెలల శిశువును ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వేగంగా వ్య‌ప్తి చెందుతున్న వైర‌స్‌ ప్రస్తుతం చైనాలోహెచ్ఎంపివి వైరస్వ్యాప్తి విపరీతంగా ఉంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాజ్మా న్యూమోనియా, కొవిడ్-19 వంటి అనేక వైరస్‌లు చైనాలో వ్యాప్తి చెందుతున్నాయి. శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధప‌డుతున్న అక్క‌డి బాధితుల వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. HMPV అంటే ఏమిటి? HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్. ఇది మొద‌ట 2001లోనే వెలుగులోకి వ‌చ్చింది. ఈ వైర‌స్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను ...
Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు
Crime

Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు

Ocean County : అమెరికాలో ఓ భార‌తీయుడు హ‌త్యకు గురైన ఘ‌ట‌న‌లో ఐదుగురు భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. 2024 అక్టోబ‌రు 22న లాస్ వెగాస్‌లోని మాంచెస్ట‌ర్ టౌన్‌షిప్ వ‌ద్ద ఈ హ‌త్య జరిగింది. కుల్దీప్ కుమార్ (35) అనే భార‌తీయుడు హ‌త‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్ట‌గా సౌత్ ఓజోన్ పార్క్, న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల సందీప్ కుమార్ దీనికి సూత్రధారుడ‌ని వెల్ల‌డైంది. మ‌రో న‌లుగురితో క‌లిసి అత‌డు ఈ హ‌త్యకు పాల్ప‌డ్డాడని త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ మేర‌కు ఓసియ‌న్ కంట్రీ ప్రాసిక్యూటర్ బ్రాడ్లీ బిల్హైమర్, న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు కల్నల్ ప్యాట్రిక్ కాలహాన్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కుల్దీప్ కుమార్ హ‌త్య‌కు సందీప్ కుమార్ సూత్ర‌ధారుడు కాగా మిగ‌తా నిందితులు సౌరవ్ కుమార్ (23), గౌరవ్ సింగ్ (27), నిర్మల్ సింగ్ (30), గురుదీప్ సింగ్ (22)గా కేసు న‌మోదైంద‌ని వివ‌రించారు.వీర...
Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ
State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ

చ‌ర్లప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ (Charlapalli railway terminal)ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు ప‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ ట‌ర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్ర‌యాల్లో మాదిరి అత్యాధునిక సౌక‌ర్యాల‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంత‌రం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేష‌న్ల‌కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి. Charlapalli railway Station లో అత్యాధునిక సౌక‌ర్యాలు ఇవే… చ‌ర్ల‌ప‌ల...
Sub Registrar : సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ పై వేటు..?
Special Stories

Sub Registrar : సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ పై వేటు..?

వివరణ ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించిన జిల్లా రిజిస్ట్రార్ విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) పై వేటు పడనుందా? నిబంధనలు కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? అత్యాశకు పోతే అసలుకే ఎసరు వచ్చిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. "సర్కార్" వెబ్ సైట్ వెలువరించిన "నాలుగు రిజిస్ట్రేషన్ లు, నాలుగు లక్షలు" అనే కథనం స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర దుమారం రేపింది.సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను ఆ నాలుగు రిజిస్ట్రేషన్ లపై తక్షణమే వివరణ ఇవ్వాలని వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఆదేశాలు జారీ చేశారు అసలేంజరిగింది..? హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం (Hanmakonda)లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ (Joint Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ నవంబర్ 21 వ తేదీన హసన్ పర్తి మండలంలో...
error: Content is protected !!