Sarkar Live

Day: July 11, 2025

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
Trending, Viral

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..

అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...
పేదలకు గుడ్ న్యూస్.. తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. – Ration Cards 2025
State, Nalgonda

పేదలకు గుడ్ న్యూస్.. తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. – Ration Cards 2025

రాష్ట్రంలో నిరుపేద లందరికీ తెల్ల రేషన్ కార్డులు (White Ration Cards) మంజూరు చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీని సూర్యపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (Tirumalagiri)లో ఈనెల 14 న ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు హాజరుకానున్న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పరిశీలించారు. అలాగే తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ...
Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం
Hyderabad, State

Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామాను బిజెపి హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన తెలంగాణ బిజెపిని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను బిజెపి హైకమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఒక వారం తర్వాత పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. దీనిని జూలై 11, 2025న బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. బీజేపీపీ నాయకుడు, గోషామహల్ (Goshamahal ) ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ శుక్రవారం (జూలై 11) అధికారిక లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజా సింగ్ ఇటీవల తన రాజీనామా లేఖను కేంద్...
Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు
Hyderabad, State

Hydraa | కొరడా ఝులిపిస్తున్న హైడ్రా.. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

Hydraa demolitions in Hyderabad : హై రాబాద్‌లో అక్రమ భవనాలపై హైడ్రా (Hydraa ) గట్టి చర్యలు తీసుకుంటోంది. కాలువలు, చెరువులు, కుంటలు, పబ్లిక్ పార్కులపై నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తోంది. శుక్రవారం (జూలై 11) కూకట్‌పల్లి ప్రాంతంలో హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి. హబీబ్ నగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. పోలీసుల భద్రత మధ్య వారు ఆక్రమణలను తొలగించారు. హబీబ్ నగర్‌లోని డ్రెయిన్ (నాలా) 7 మీటర్ల పొడవు ఉంది. హైడ్రా NRC గార్డెన్, NKNR గార్డెన్ నుండి సరిహద్దు గోడలకు, డ్రెయిన్‌కు అడ్డుగా ఉన్న మరొక గోడను కూల్చివేసింది. వారు ఆ ప్రాంతం నుండి చెత్త, ఇతర వ్యర్థాలను కూడా తొలగించారు. Hydraa : రాజేంద్ర నగర్​ లో పార్కు భూమి స్వాధీనం మరో కేసులో, రాజేంద్రనగర్‌లోని పార్క్ భూమిలో అక్రమ భవనాలను హైడ్రా తొలగించింది. పార్క్ భూమిని అనధికారికంగా ఉప...
Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​
Crime

Bribe ఏసీబీ వలలో సబ్​ఇన్​స్పెక్టర్​

మహిళా పోలీస్ స్టేషషన్​ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) కి పట్టుబడ్డాడు. కుటుంబ కలహాలతో అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ వ్యక్తి గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్​కు వచ్చాడు. ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్సై వేణుగోపాల్ బాధితుడి మీద అత్తింటి వారు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేస్తానని, కేసు లేకుండా చూసుకుంటానని అందుకు తనకు కొంత మొత్తం (Bribe ) ఇవ్వాలని ఒప్పందంకుదుర్చుకున్నాడు. దీనికి బాధితుడు అంగీకరించి లంచమిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు గురువారం సాయంత్రం గచ్చిబౌలి మహిళా పోలీస్టేషన్ ఎస్సై వేణుగోపాల్ బాధితుడి వద్ద నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేణుగోపాల్ ఇటీవలే పదోన్నతిలో భాగంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్...
error: Content is protected !!