IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్ల బదిలీ
                    Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు స్థానచనలం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు కేటాయించింది. మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉంచింది.ఇక జీఏడ...                
                
             
								


