Skip to main content

Sarkar Live

Day: November 12, 2025

Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు
State

Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు

ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్‌ వరంగల్​/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్​ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సార...
Delhi High Alert |  ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట
National

Delhi High Alert | ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట

Delhi News High Alert : న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న మ‌రో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ వాహనం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్‌లో వున్నాయి. పేలుడులో ఉపయోగించిన హ్యుందాయ్‌ i20 కారుతో పాటు, నిందితులు ఈ ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు పోలీసుల‌ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఐదు ప్రత్యేక ఢిల్లీ పోలీసు బృందాలు వాహనాన్ని వెతుకుతుండగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం ఎర్ర‌కోట‌ మెట్రో స్టేషన్ గేట్ నంబర్​ 1 సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హ్యుందాయ్‌ i20 కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని భీరకమైన పేలుడు సంభవించింది. సమీపంలోని అనేక ...
Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ
State, Karimnagar

Vemulawada | వేములవాడ ఆలయం మూసివేతతో భక్తుల్లో నిరాశ

ఆలయ ద్వారాల ఎదుటే పూజలు నిర్వహిస్తున్న భక్తులు కరీంనగర్: వేములవాడలోని ప్ర‌సిద్ధ‌ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Temple) బుధవారం పూర్తిగా మూసివేశారు. మ‌హ‌దేవుడికి ప్ర‌తీక‌ర‌మైన కార్తీక మాసం కావ‌డంతో సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు వేముల‌వాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆల‌య ప్ర‌ధాన ద్వారాలు మూసివేయ‌డంతో అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పునరుద్ధరణ పనులు జరుగుతుండటంతో, అధికారులు దర్శనాలను నిలిపివేసి ఆలయ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. సమీపంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, అనేక మంది భక్తులు ప్రధాన ఆల‌యానికి సంబంధించిన‌ మూసివేసిన ద్వారం వద్ద పెద్ద సంఖ్య‌లు భ‌క్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ప్రధాన ద్వారం వద్ద ఆలయ పశ్చిమ భాగంలో ఉన్న శివుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్ట‌డం, దీపాలు వెలిగించడం, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం క‌నిపించింది. కార్తీక మాసం అత్యంత పవిత్...
error: Content is protected !!