Sarkar Live

Day: November 18, 2025

Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?
State

Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేల‌కు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుద‌లైన నిధులు ఇలా.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖ‌ర్చు కోసం రూ. 34.91 కోట్లు, క‌మ్యూనిటీ కుకింగ్ హెల్ప‌ర్స్‌కు రూ.10 కోట్లు విడుద‌ల చేసింది. సహాయకులైన హెల్పర్స్‌కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.ప్రభుత్వం విడుదల...
IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు
Crime

IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు

IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసి పోయాయి. గ‌ర్భంలో ఉండ‌గానే క‌వ‌ల (twins) శిశువులు మృతి చెంద‌గా, కాసేప‌టికే త‌ల్లి తీవ్ర అస్వ‌స్త‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిన్న‌ఉద‌యం చోటుచేసుకోగా పూర్తి వివ‌రాలు ఈరోజు వెల్ల‌డ‌య్యాయి. ఆనందం.. అంత‌లోనే… శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివ‌సిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. వివాహ‌మై కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ అవుతున్నా వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ స‌ల‌హా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్ల‌లు పుడతార‌ని చెప్ప‌డంతో ఓ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ వైద్యం పొందిన శ...
మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter
AndhraPradesh

మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter

Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదుర‌ప‌డ‌డంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు స‌మాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా...
error: Content is protected !!