Sarkar Live

Day: March 3, 2026

వరంగల్‌ కమిషనరేట్ లో హోలీ సంబరాలు
Crime

వరంగల్‌ కమిషనరేట్ లో హోలీ సంబరాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate )కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌కు అధికారులు, సిబ్బంది రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్‌లతో సందడి చేశారు. హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని , అందరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident
Mahaboobnagar, Crime

జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. Jadcherla Hospital : అసలేం జరిగింది? జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధ...
తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!
State, Hyderabad

తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు!

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల సంబరాల ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలు నింపాలని, ప్రతి హృదయంలో స్నేహం, ప్రేమ, ఐక్యత వికసించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ పండుగ మన సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలపరచాలని, విభిన్నతలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగగా నిలవాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యాలతో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజ రంగులతో, సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. “రంగుల హోలీ ప్రతి మనసును రంగరించి, సంతోషాల వర్షం కురిపించాలని ఆశిస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు...
error: Content is protected !!