Sarkar Live

Day: April 18, 2026

తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave
Special Stories

తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave

Telangana Heatwave Alert | తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మున్ముందు ఈ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్ నినో ఎఫెక్ట్: ఎందుకీ తీవ్రత? పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ వరకు పెరగడంతో 'ఎల్ నినో' పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం దక్షిణ భారతదేశంపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలపై ప్రభావం: ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది, దీనివల్ల వర్షపాతం తగ్గి వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగవచ్చు. ముంచుకొస్తున్న ముప్పు: రానున్న మే, జ...
ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam
Special Stories

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam

​రెవెన్యూ అధికారుల అండతో ఖజానాకు గండి.. వరంగల్ జిల్లా ధర్మారంలో వెలుగుచూసిన వైనం ​Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా 'రైతుబంధు', 'రుణమాఫీ' వంటి ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రెవెన్యూ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ​నాలా (NALA) భూమికి పట్టా ఎలా? ​నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మార్చాల్సి ఉంటుంది. గీసుగొండ మండలం ధర్మారం శివారులో సదరు పాఠశాల యజమాని ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఇప్పటికే నాలా అనుమతులు కలిగి ఉన్నారు. అయితే, ఇక...
error: Content is protected !!