తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన అధికారులకు ఈ పదోన్నతులు లభించాయి.డీజీలుగా ప్రమోషన్ అందుకున్న వారిలో వీవీ శ్రీనివాసరావు, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్ ఉన్నారు....


