Skip to main content

Sarkar Live

Day: May 22, 2026

ఏసీబీ సంచలనం: డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై దాడులు..
Crime

ఏసీబీ సంచలనం: డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై దాడులు..

తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) మరోసారి వణుకు పుట్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే నమ్మదగిన సమాచారంతో.. మే 22, శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వంశీ మోహన్‌కు సంబంధించి హైదరాబాద్, శేరిలింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి సహా మొత్తం 8 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి? వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాలలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విలువైన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు, రియల్టర్లకు కేటాయించి, వాటి ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిఘాలో తేలి...
CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?
Special Stories

CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?

​దేశంలో ఒక సరికొత్త డిజిటల్ రాజకీయ విప్లవం తెరపైకి వచ్చింది. సీరియస్ రాజకీయాలకు భిన్నంగా.. వ్యంగ్యం, మీమ్స్ ఆయుధాలుగా పుట్టుకొచ్చిన ఒక సరికొత్త 'ట్రెండ్' ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అదే "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP‌‌ – Cockroach Janata Party). కేవలం ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్‌లో అధికార పక్షం (BJP) కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని, ఏకంగా 1.5 కోట్లకు పైగా ఫాలోవర్లతో దూసుకుపోతున్న ఈ డిజిటల్ ఉద్యమం వెనుక యువత పెను నిరసన దాగి ఉంది. ​సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో రగిలిన మంట ​ఈ ఉద్యమానికి బీజం పడింది 2026 మే 15న జరిగిన ఒక సుప్రీంకోర్టు విచారణలో ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు సందర్భంగా మాట్లాడుతూ.. "ఉద్యోగాలు లేక, వృత్తిలో రాణించలేక కొందరు యువకులు బొద్దింకల్లా, సమాజ పరాన్నజీవుల్లా మారుతున్నారు. వారంతా జర్నలిస్టులు, ఆర్‌టీఐ (RTI) కార్యకర్తలు, సోషల్ ...
error: Content is protected !!