ఏసీబీ సంచలనం: డిప్యూటీ కలెక్టర్ ఇళ్లపై దాడులు..
తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) మరోసారి వణుకు పుట్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే నమ్మదగిన సమాచారంతో.. మే 22, శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వంశీ మోహన్కు సంబంధించి హైదరాబాద్, శేరిలింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి సహా మొత్తం 8 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.
ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి?
వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాలలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విలువైన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు, రియల్టర్లకు కేటాయించి, వాటి ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిఘాలో తేలి...

