Sarkar Live

Day: May 29, 2026

కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?
Special Stories

కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?

Telangana Politics - Congress Internal War | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party)ని కూలదోయడానికి ప్రత్యర్థుల అవసరం లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పదవీకాలం మధ్యలోనే, పార్టీ అంతర్గత నాయకత్వం స్వీయ విధ్వంసక రాజకీయాల్లో ఆరితేరినట్లు స్పష్టమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయకర్తగా సాగుతున్న బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) చుట్టూ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం తెరపైకి వచ్చింది. ఒక ప్రముఖ ఛానల్‌లో ఆయనను "అసమర్థుడిగా" చిత్రీకరిస్తూ వచ్చిన కథనాలు గాంధీభవన్‌తో పాటు లండన్, ఢిల్లీ వేదికల వరకు పెను కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ఛానల్‌లోనే వ్యతిరేక వార్తలు! సాధారణంగా ఒక టీవీ ఛానెల్‌లో ఇలాంటి వ్యతిరేక కథనం రావడం పెద్ద విషయమేమీ కానప్పటికీ, సదరు ఛానెల్ యజమాని ముఖ్యమంత్...
error: Content is protected !!