కోర్టు కేసులో ఉన్న భూమి‘మ్యూటేషన్’ – Illegal Land Mutation
పరకాల తహసీల్దార్పై బాధితుల ఆగ్రహం !
ఆర్ఐ, జీపీఓ రిపోర్టులు లేకుండానే పట్టా జారీ?
సాగు చేయని భూమికి రెవెన్యూ అధికారుల ‘కృప’!
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
Illegal Land Mutation | హన్మకొండ జిల్లా పరకాల మండలంలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం బట్టబయలైంది. కోర్టు పరిధిలో ఉండి, క్షేత్రస్థాయి పరిశీలన కూడా లేని ఒక వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, పట్టా పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పరకాల మండలం మాదారం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 665లో గల 16 గుంటల భూమి ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదంలో ఉంది. ఈ భూమిపై కోర్టు కేసు నడుస్తుండటంతో, ఎవరికీ రిజిస...
