ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్
•ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదు •తెలంగాణలో మావోయిజం అంతమైందని వ్యాఖ్య •గ్రేహౌండ్స్ విభాగంలో భారీ మార్పులు.. 1700 మంది సిబ్బంది బదిలీగంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో ఇకపై "ఫ్రెండ్లీ పోలీసింగ్" అనే విధానానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రజలకు గౌరవం ఇస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రస్తుతం మావోయిజం అంతరించిపోయిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
గ్రేహౌండ్స్ విభాగంలో కీలక మార్పులు చేపడుతున్నామని వెల్లడించిన డీజీపీ, ఆ విభాగంలోని సుమారు 1700 మంది సిబ్బందిని...
