Sarkar Live

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో

Accident

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…

హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసుల (Police) సహకారంతో స్థానికులు సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.

ప్రాణాల‌ను బ‌లిగొన్న అతి వేగం!

ఈ ప్రమాదానికి అధిక వేగమే ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. జాతీయ రహదారి NH-44 దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రోడ్ల‌లో ఒక‌టి. దీనిపై నిత్యం వందలాది వాహనాలు ప్ర‌యాణిస్తుంటాయి. వేగ పరిమితిని పాటించకుండా వాహ‌నాల‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
“రోడ్డు మీద తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు స్పీడ్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్నారు కానీ, డ్రైవర్లు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఒక క్షణం వేగం ప్రాణాలను బలి తీసుకుంటుంది. ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Accident : సంఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలించిన పోలీసులు

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) కోసం ఆస్ప‌త్రికి తరలించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి నిజమైన కారణం ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు వాహనాల టెక్నికల్ స్థితిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి రోడ్డు భద్రతపై మనందరికీ హెచ్చరికలాంటిద‌ని అంటున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని సూచిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?