Allu Arjun Bail : హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. రాష్ట్ర హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు, అల్లు, మెగా స్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుని 34 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను ఏ11 నమోదు చేసి ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్గూడ జైలులో విచారణ చేపట్టారు. తర్వాత ఆ కోర్టు 14 రోజుల రిమాండ్ ఇవ్వడంతో అందరూ షాక్ కు గురయ్యారు. చివరకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన […]