Sarkar Live

Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం

Delhi Elections 2025 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Delhi Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులకు

Chandrababu Naidu

Delhi Elections 2025 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Delhi Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ఆయ‌న‌ ప్రచారం చేయ‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బాబు బ‌య‌ల్దేరారు.

ఎన్డీయేలో టీడీపీ ప్రాముఖ్యత

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA)లో తెలుగుదేశం పార్టీ (TDP) రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ పార్టీ 16 గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే వ్యూహాన్ని మరింత బలపరిచేందుకు ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయ‌న ప్రచారం చేయ‌నున్నారు.

తెలుగు వారి మ‌ద్ద‌తు కోసం చంద్ర‌బాబు ప్ర‌చారం

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, చిన్నపాటి ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరి మద్దతు సాధించడానికి టీడీపీ అధినేత నాయుడు వ్యూహ‌ర‌చ‌న చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Delhi Elections : బీజేపీకి బ‌లం చేకూర్చేందుకు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Elections ) ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవుతాయి. ఈ ఎన్నికల ప్రచారంలో పలువురు ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు ప్ర‌చారం చేస్తున్నారు. త‌ద్వారా తెలుగు ప్రజల ఓట్లు బీజేపీకి మరింతగా చేరే అవకాశం ఉందని ఆయ‌న‌ భావిస్తున్నారు.

ప్ర‌ధాన ఎజెండా తెలుగు ప్ర‌జ‌ల సంక్షేమం

ఢిల్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డి తెలుగు సంఘాలు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలు ముందుగా సమావేశాలు ఏర్పాటు చేశాయి. తెలుగు ప్రజల కోసం ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రత్యేక పథకాలు ప్రారంభించాలనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నారు. ఢిల్లీలో టీడీపీ కేడర్‌ను బలోపేతం చేసి, భవిష్యత్తులో పార్టీని మరింత వ్యాప్తి చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఎన్డీయే మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, ఢిల్లీ తెలుగు ప్రజల సంక్షేమం గురించి హామీలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు బీజేపీని కోరే అవకాశం ఉంది.

ఏపీకి ప్ర‌యోజ‌నం చేకూరేలా..

చంద్రబాబు ప్రచారం వల్ల బీజేపీకి తెలుగు ప్రజల‌ ఓటింగ్ శాతం పెరిగే వీలుంద‌ని ఆ పార్టీతోపాటు టీడీపీ అంచ‌నా వేస్తోంది. త‌ద్వారా బీజేపీ, టీడీపీల మ‌ధ్య అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే ఆంధ్రప్ర‌దేశ్‌కు కేంద్రం నుంచి మ‌రిన్ని ప్ర‌యోజ‌నం చేకూర‌నుంద‌ని టీడీపీ ఆశిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

One thought on “Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!