Sarkar Live

ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌.. క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ

ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శ‌నివారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండ‌గులు రూ. 30 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ప‌టిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి

ATM loot case

ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శ‌నివారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండ‌గులు రూ. 30 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ప‌టిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి దొంగ‌త‌నం చేశారు. ఈ సంఘటన తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఎలాంటి హ‌డావిడి లేకుండా.. ఎంతో జాగ్ర‌త్త‌గా..

రావిరాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం దగ్గర రాత్రివేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు కారులో వచ్చి ముందుగా పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎవరైనా గస్తీ తిరుగుతున్నారా? ఎవరైనా చూస్తున్నారా? అనే విషయాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ముందుగా సీసీ కెమెరాలను పని చేయకుండా చేయడానికి కెమికల్ స్ప్రే ఉపయోగించారు. ఇది కెమెరా లెన్స్‌ను మసకబార్చి, ఏ విధంగా కూడా దృశ్యాలను రికార్డ్ కాకుండా చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వారు ఏటీఎం భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మరిన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమర్జెన్సీ అలారంను నిలిపివేయడానికి ఏటీఎం సెన్సార్ వైర్లను కట్ చేశారు. సాధారణంగా ఏటీఎంలలో అలారం ఉండటంతో చోరీ జరిగితే అది వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సంకేతాలను పంపిస్తుంది. కానీ, ఈ దొంగలు ముందుగా అన్ని రక్షణా చర్యలను ప‌రిశీలించి ఎలాంటి అవాంతరాలు లేకుండా చేశారు. భద్రతా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యంగా చేసిన తర్వాత గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లు ఉపయోగించి ఏటీఎం మిషన్‌ను తెరిచారు. ఈ గ్యాస్ కట్టర్ ఎంతో శక్తిమంతమైనది, దీంతో ఇనుమును కూడా కొద్దిసేపట్లో కరిగించవచ్చు. దాదాపు 15 నిమిషాల పాటు ప్రయత్నించిన తర్వాత వారు ఏటీఎం తలుపును తెరిచారు. మొత్తం రూ.30 లక్షలు దోచుకెళ్లారు. ఎక్క‌డా ఆధారాలు దొర‌క్క‌కుండా ఏమాత్రం హ‌డావిడి లేకుండా దొంగ‌లు జాగ్ర‌త్త ప‌డ్డారు. వెంట తెచ్చుకున్న ప‌రిక‌రాల‌ను అక్క‌డే వ‌దిలేయ‌కుండా తీసుకెళ్లిపోయారు.

ATM loot case : రంగంలోకి పోలీసులు

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీపీ సునీతారెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ప‌రిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండ‌గుల‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు. అనుమానాస్పద వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎవరు కొత్తగా సంచరిస్తున్నారనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి ఏమైనా క్లూ దొరుకుతుందా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే దొంగలు కెమెరాలను ముందు నుంచే స్ప్రేతో మసకబార్చడం వల్ల వారి ఫొటోలు స్పష్టంగా రాలేదు. కానీ, మరికొన్ని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల‌ను పరిశీలించడంతో కొన్ని లీడ్స్ లభించినట్లు సమాచారం.

గతంలో జరిగిన ఏటీఎం దొంగతనాలు

ఇదే తరహా ఘటనలు గతంలో కూడా కొన్ని చోట్ల జరిగాయి. 2023లో న‌ల్ల‌గొండ‌లో ఇదే విధంగా దొంగలు ఏటీఎంను కట్ చేసి రూ.20 లక్షలు దోచుకెళ్లారు. అలాగే 2024 జనవరిలో విజయవాడలో జరిగిన చోరీలో రూ.35 లక్షలు దొంగతనం జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పట్టుకోవ‌డానికి పోలీసుల‌కు కొంత స‌మ‌యం ప‌ట్టింది. ఈ ఘటనతో బ్యాంకులు మరింత అప్రమత్తమయ్యాయి. బ్యాంక్ యాజ‌మాన్యాలు భద్రతను పెంచే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, ఏటీఎంల వద్ద 24 గంటల పహారా ఉండేలా చూడాలని నిర్ణయించారు. అదనంగా రాత్రివేళ కొన్ని ఏటీఎంలను మాత్రమే ఓపెన్ ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?