Sarkar Live

Author: Maulika

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism
State, Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism

Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం క‌లిగిన న‌గ‌రం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ ఐటీ హబ్‌ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ...
Accident |  జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Crime

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...
తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%
Business

తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%

Next-Gen GST : తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌ జీఎస్టీ (next generation GST) విధానాన్ని అమ‌ల్లో తెచ్చేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత (K Haritha, Commissioner of Commercial Taxes) వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం పన్ను స్లాబ్స్‌లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్లు (notifications) విడుదలయ్యాయ‌ని, వాటిని రాష్ట్రం వెంటనే అమలులోకి తెచ్చిందని ఆమె ఈ రోజు వెల్ల‌డించారు. 'మా విభాగం ఇప్పటికే క్షేత్ర‌ స్థాయిలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు కొత్త పద్ధతిని ఎలా అనుసరించాలో వివ‌రించాం. అయినప్పటికీ అసలు సమస్యలు వచ్చే నెలలో రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మాత్రమే బయటపడతాయి' అని అని కూడా హరిత తెలిపారు. ప్రస్తుతం త‌మ విభాగం తరఫున ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని కమిషనర్ ...
తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics
Special Stories

తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రోజురోజుకూ వేడెక్కుతోంది. వర్షకాలంలోనూ పాలిటిక్స్ హీటెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది.పార్టీలు మారడమనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు మార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం ఫిరాయింపు వివాదం ఇంకాస్త ముదిరిందని తెలుస్తోంది. ఇది రాజకీయ వర్గాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఫిరాయింపుల వెనుక కారణాలు ఇవేనా? ఎమ్మెల్యేలు ఒక పార్టీని వదిలి మరొక పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార...
Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం
Crime

Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం

Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన క‌ల‌కలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్య‌క్తి క‌న్నత‌ల్లిని కొడ‌వ‌లితో దాడి చేసి హ‌త‌మార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చెవెళ్ల‌ మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అత‌డు తల్లితో ఏదో ఒక విష‌యంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అత‌డు మ‌రింత కోపోద్రిక్తుడై విచ‌క్ష‌ణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి త‌ల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాత‌కంగా గాయ‌ప‌ర్చాడు. దీంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్...
error: Content is protected !!