High Alert | పాకిస్తాన్ కాల్పులు… తిప్పికొట్టిన భారత్
High Alert : నియంత్రణ రేఖ (Line of Control - LoC) వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ (Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు (provocative firing) జరుపుతుండటంతో భారత భద్రతా దళాలు (security forces) అప్రమత్తం (High Alert)గా ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ చిన్న ఆయుధాలతో కాల్పులు ప్రారంభించింది. భారత సాయుధ దళాలు ఈ చర్యకు తక్షణమే స్పందించాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు!
పాకిస్తాన్ ప్రస్తుతం భయానక స్థితి (panic)లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సరిహద్దుల్లో (border) కాల్పులు జరపడానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. ఈ కాల్పులు చొరబాటుదారులకు, క్రియాశీల ఉగ్రవాదులకు కవర్ ఫైర్గా ఉపయోగపడే అవకాశం ఉంది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను చొప్పించే ప్రయత్నం...




