Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘటనపై సుప్రీం సీరియస్
Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేతపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్లను ఎందుకు నరకాల్సి (tree felling) వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
ఎవరిని అడిగి అడవిని నరిశారు?
కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచ గచ్చిబౌలి భూమిలో అభివృద్ధి పనులను తాత్కాలికంగా ...




