Mithra Vibhushana | మోదీకి శ్రీలంక అత్యున్నత అవార్డు..
Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అందజేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. శ్రీలంక (Sri Lanka) పర్యటనలో మోదీ ఉండగా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్యక్రమం ఇవాళ జరిగింది.
Mithra Vibhushana Award : అత్యున్నత పౌర పురస్కారం
మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరి...




