Sarkar Live

Author: Maulika

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..
State

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..

Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్ర‌భుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అంద‌జేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్ర‌ధాని మోదీ ఈ పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. శ్రీ‌లంక (Sri Lanka) ప‌ర్య‌ట‌న‌లో మోదీ ఉండ‌గా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్య‌క్ర‌మం ఇవాళ జ‌రిగింది. Mithra Vibhushana Award : అత్యున్న‌త పౌర పుర‌స్కారం మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరి...
Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్
Crime

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్

Deepfakes : దేశంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), కృత్రిమ మానవీయ మీడియా (synthetic media) ద్వారా జరిగే మోసాలు, అభద్రతలకు పాల్పడుతున్న క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Centre) మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల (social media platforms)ను హెచ్చరించింది. దేశ ప్రజలకు నమ్మకమైన, భద్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ (Deepfakes) అంటే ఏమిటి? డీప్‌ఫేక్ (Deepfakes) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారు చేసిన వీడియో లేదా ఆడియో. ఇందులో నిజంగా ఎవరూ మాట్లాడని మాటలు, చేయని చర్యలు ప్రోగ్రామ్ ద్వారా రూపొందించబడతాయి. ఎవరైనా ప్రసిద్ధ వ్యక్తి మాట్లాడినట్లు చూపించడం, వారు చేయనిది చేసినట్లు చూపించడం డీప్‌ఫేక్ అనే పద్ధతిలో సాధ్యమవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున...
Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ
National

Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ

Indian Railways : భారతీయ రైల్వే స‌రికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల త‌యారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల త‌యారీకి ప్రాధాన్యం ఈసారి ప్రత్యేకంగా నాన్ ఏసీ కోచ్‌ల (non AC coaches) ఉత్పత్తికి భార‌తీయ రైల్వే ప్రాధాన్య‌మిచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4,601 సాధారణ కోచ్‌ల (coaches)ను తయారు చేశారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 3,300 కోచ్‌ల ఉత్పత్తి (Coach production) మాత్రమే జరగ్గా 2014-2024 మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత దశాబ్దంలో 54,809 కోచ్‌లను ఉత్పత్తి చేయగా...
Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ
State

Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ

Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో కీలక భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సింగ‌పూర్ భాగ‌స్వామ్యంతో.. ప్రధాని మోదీ ఈ నెలలో రాష్ట్రాన్ని సందర్శించి, అమరావతి రాజధాని (Amaravati Capital) పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజ...
Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు
State

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ చేసింది. Kancha Gachibowli : పిటిష‌న్ దాఖ‌లు కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా చేపడుతున్న చర్యలు వన్యప్రాణాలకు హాని కలిగించేలా ఉన్నాయని ప‌లువురు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషన్ దాఖ‌లు చేశారు. భూమిని సమతలీకరించేందుకు ముందుగా నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చే...
error: Content is protected !!