Ashok Leyland | ఏపీలో మరో భారీ పరిశ్రమ.. రానున్న బస్సుల తయారీ కేంద్రం
Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధిలో మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించానని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన ...




