Sarkar Live

Author: Maulika

UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు
Business

UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు

UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్ల‌వాత్మ‌క వృద్ధి చెందుతోంది. డిజిట‌ల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR - క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విష‌యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్ల‌డైంది. త‌గ్గుముఖం ప‌ట్టిన ఇత‌ర చెల్లింపులు ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సులువైన ప‌ద్ధ‌త...
Andrea Hewitt | ఆయ‌నతోనే ఉండి పోదామనుకుంటున్నా.. కాంబ్లీ భార్య‌ సంచ‌ల‌న కామెంట్‌
Viral

Andrea Hewitt | ఆయ‌నతోనే ఉండి పోదామనుకుంటున్నా.. కాంబ్లీ భార్య‌ సంచ‌ల‌న కామెంట్‌

భారత క్రికెట్ జ‌ట్టు మాజీ క్రీడాకారుడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) భార్య ఆండ్రియా హెవిట్ (Andrea Hewitt) ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వాల‌నుకున్నా గానీ, ఆయ‌న అనారోగ్య స్థితిని చూసి నిర్ణ‌యాన్ని మార్చుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆండ్రియా హెవిట్ ఈ కామెంట్లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. వ‌దిలి వెళ్లిపోదామ‌నుకున్నా : Andrea Hewitt ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యాంశీ పాండే నిర్వహించిన ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆండ్రియా హెవిట్ మాట్లాడారు. కాంబ్లీతో వైవాహ‌క బంధానికి స్వ‌స్తి ప‌లకాలని 2023లో విడాకుల కోసం దరఖాస్తు చేశాన‌ని వెల్లడించారు. ఆయ‌న మద్యానికి బానిసైపోవడం తమ వైవాహిక జీవితంపై ఎంత తీవ్ర ప్రభావం చూపిందో వివరించారు. ఆయ‌న ఎలా బ‌తుకుతాడ‌న్న‌దే బెంగ కాంబ్లీని వ‌దిలి వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకొనే దాన్న‌ని, ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా ఆ ప‌ని చేయ‌లేక‌పోయాన...
Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు..  మరో 18 మందిపై న‌మోదు
State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై న‌మోదు

Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్ట‌ర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఓ త‌ప్పుడు కేసులో ఇరికిన త‌న‌ను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డ‌మే కాకుండా త‌న‌ను కులం పేరుతో దూషించి అవ‌మాన‌ప‌ర్చార‌ని ఓ వ్య‌క్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌లు తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంట‌ర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాన‌ని దుర్గ‌ప్ప అనే వ్య‌క్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికాన‌ని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొల‌గించార‌ని పేర్కొన్నారు. Infosys...
TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..
State

TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..

Survey on TG Employees | తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. అంకిత‌భావం, నిబద్ధ‌త క‌లిగిన వారు. త‌మ విధుల్లో ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛిస్తారు. ఈ మాట‌లు అంటున్న‌దెవ‌రో కాదు.. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యురాలి రూపొందించిన‌ నివేదిక‌లే చెబుతున్నాయి. ఇండియాలో వారానికి 70 గంటల పని చేయాలని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు అంత‌క‌న్నా ఎక్కువ స‌మ‌య‌మే వెచ్ఛిస్తూ విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని వెల్ల‌డైంది. TG Employees : రోజుకు ఎన్ని గంట‌లు ప‌ని చేస్తున్నారంటే.. తెలంగాణ రాష్ట్రం (Telangana) లోని ఉద్యోగులు రోజుకు సగటున 433 నిమిషాలు (7.21 గంటలు) పనిచేస్తున్నారు. ఇది దేశ సగటు 422 నిమిషాలు (7.03 గంటలు) కంటే ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగట...
Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…
Trending

Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…

Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మ‌హిళను పెద్దపులి దాడి చేసి చంపడం క‌ల‌క‌లం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్ద‌పులి ఆ త‌ర్వాత వరుస దాడులకు పాల్పడటం మ‌రింత భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పులిని కేర‌ళ ప్ర‌భుత్వం మ్యాన్ ఈట‌ర్ (Man eating Tiger)గా ప్ర‌క‌టించి, దానిని సుర‌క్షితంగా ప‌ట్టుకొనేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేపట్టింది. ముమ్మ‌ర గాలింపుల త‌ర్వాత‌.. పెద్ద పులి దాడుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు తీవ్ర ప్ర‌యత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడ‌వుల్లో గాలించారు. చివ‌ర‌కు ఆ పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. మ‌రో క్రూర మృగం చేతిలో… ...
error: Content is protected !!