Sarkar Live

Author: Maulika

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..
Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..

Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జ‌రిగిన దారుణ హ‌త్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బ‌య‌ట‌పేడేలా పొడిచి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్య వెనుక కార‌ణాల‌పై పోలీసులు ముమ్మ‌రంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండ‌టం వ‌ల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయ‌న అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉలిక్కిప‌డిన భూపాల‌ప‌ల్లి మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధ‌వారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...
Secunderabad station | సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి
State

Secunderabad station | సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి

Secunderabad Railway station : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ప్ర‌యాణికుల‌కు స‌రికొత్త హంగుల‌తో మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను పెంచేందుకు పున‌ర్నిర్మాణం సాగుతోంది. ఈ ప‌నుల నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రైల్వే శాఖ (South Central Railway-SCR) ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప్ర‌యాణికులు స్టేష‌న్ (Secunderabad station) లోప‌లికి వెళ్లడానికి, బ‌య‌ట‌కు రావ‌డానికి ఉన్న మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. Secunderabad station | కొత్త మార్గాలు ఇవే.. ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1: గణేష్‌ ఆలయం పక్కన గేట్‌ నంబర్‌ 2 వద్ద కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులు స్టేషన్‌లోకి సులభంగా ప్రవేశించేందుకు సహాయపడుతుంది. గేట్‌ నంబర్‌ 4: ఈ గేటును మూసివేశారు. స్వాతి హోటల్‌ ఎదురుగా గేటు నంబర్ 3తోపాటు 3బీ అనే అదనపు ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రయ...
Tea stall shut down | కేటీఆర్ పేరుతో టీస్టాల్‌.. మూసివేయించిన క‌లెక్ట‌ర్‌
State

Tea stall shut down | కేటీఆర్ పేరుతో టీస్టాల్‌.. మూసివేయించిన క‌లెక్ట‌ర్‌

Tea stall shut down : సిరిసిల్ల రాజ‌న్న జిల్లాలో చోటుచేసుకున్న ఓ సం ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చనీయాంశమైంది. కేటీఆర్ పేరు(KTR Tea Stall)తో ఉన్న ఓ టీస్టాల్‌ను క‌లెక్ట‌ర్ మూసి వేయించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ లైసెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు. కేటీఆర్ పేరు పెట్ట‌డం వ‌ల్లేనా Tea stall shut down? సిరిసిల్ల రాజ‌న్న (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని బ‌తుక‌మ్మ ఘాట్ వ‌ద్ద బ‌త్తుల శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి నాలుగేళ్లుగా టీస్టాల్ నిర్వ‌హిస్తున్నాడు. దానికి కేటీఆర్ టీస్టాల్ (KTR Tea Stall ) అనే పేరు పెట్టాడు. సైన్‌బోర్డుపై కేటీఆర్ ఫొటోను కూడా ప్ర‌ద‌ర్శించాడు. ఆ ప్రాంతంలో అభివృద్ధి ప‌నుల నిమిత్తం క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఇటీవ‌ల పర్య‌టించారు. కేటీఆర్ (BRS working president KT Rama Rao) పేరుతో శ్రీ‌నివాస్ నిర్వ‌హిస్తున్న టీస...
Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌
Trending

Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నిజ‌మైన ఏనుగుల్లా Mechanical Elephants ఉత్స‌వాల్లో ఏనుగుల‌ను వినియోగించ‌డం వల్ల శారీర‌క‌, మాన‌సిక ఒత్తిడి పెరిగి అవి విచ‌క్ష‌ణ కోల్పోయి హింసాత్మ‌కంగా మారుతున్నాయ‌ని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగుల‌ను వినియోగించాల‌ని కోరింది. అచ్చం అస‌లైన ఏనుగుల్లా జీవం ఉట్టిప‌డే విధంగా ఇవి ఉంటాయ‌ని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ‌) ఏనుగుల‌ను తాము స‌మ‌కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని PETA అంటోంది. అయితే.. దానికి ఒక ష‌ర‌తు విధించింది. ఉత్స‌వాల‌కు వి...
error: Content is protected !!