Sarkar Live

Author: Maulika

RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌
State

RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌

RTC Tickets in WhatsApp : పౌర‌సేవ‌ల్లో సాంకేతికత‌ను విరివిగా వినియోగంలోకి తెస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) కొత్త‌గా మ‌రో విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బ‌స్సు టికెట్‌ను బుక్ చేసుకొనే సౌల‌భ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్ర‌యాణికులు బ‌స్సును సుల‌భంగా బుక్ చేసుకొని వేగ‌వంత సేవ‌లు పొందొచ్చు. ఇప్పటి వరకు బస్సు టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్ర‌యాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వినియోగించే వారు. లేదా టికెట్ కౌంటర్ వ‌ద్ద‌కు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సౌక‌ర్యం ద్వారా మొబైల్‌లో ఉన్న WhatsApp యాప్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. RTC Tickets in WhatsApp : ప్రయాణికులకు పెద్ద ఊర‌ట‌ వాట్సాప్ ద్వారా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకొనేందుకు ఏపీ ప్ర‌భుత్వం కొత్త సేవల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో ప్రయాణికులకు (Passengers) పెద్ద ఊరట ల‌భ...
Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు
World, Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు

ఉన్న‌త చదువులు, బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్తున్న తెలుగు యువ‌కులు త‌ర‌చూ అనేక దుర్ఘ‌ట‌న (Tragic incident)ల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుప‌డ‌తామ‌ని దేశం కాని దేశానికి వెళ్తున్న త‌మ బిడ్డ‌లు విగ‌త‌జీవులుగా మార‌డంతో వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైద‌రాబాద్‌కు చెందిన ఒక యువ‌కుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఐర్లాండ్‌లో గుంటూరు యువ‌కులు ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గ‌వ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...
Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి విశిష్టత..  తేదీ, సమయాలు, వ్రత కథ ..
LifeStyle

Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి విశిష్టత.. తేదీ, సమయాలు, వ్రత కథ ..

Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పదకొండవ తిథి. ఈ ఏకాదశి (Ekadashi) హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి, ఉపవాసం ఉంటారు. ఇది వారికి పాప విమోచనం కలిగిస్తుందని, స్వర్గలోక ప్రాప్తి సాధ్యమవుతుందని నమ్ముతారు. Jaya Ekadashi … పురాణ గాథ పురాణ గాథల ప్రకారం ఒకసారి స్వర్గలోకంలో గంధర్వుడు మాల్యవాన్ అనే యువకుడు పుష్పవతి అనే గంధర్వ యువతితో ప్రేమలో పడి స్వర్గ రాజ్య నియమాలను అతిక్రమించాడు. అతని వైకల్యం కారణంగా దేవేంద్రుడు కోపగించి మాల్యవాన్‌ను భూమికి పంపించాడు. అతడు పిశాచ రూపాన్ని ధరించి భూమిపై చాలా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాడు. కానీ, కొద్ది కాలం తర్వాత మాఘ శుక్ల ఏకాదశి రోజు అనుకోకుండా ఉపవాసం చేయడం వల్ల అతనికి విముక్తి లభించింది. అతను తిరిగి తన మానవ రూపాన్ని పొంది స్వర్గలోకి చేరాడు.జయ ఏకాదశి ఉపవాసం వల్ల పాప విమోచనం, భవబంధ విప్పు,...
NTPC Recruitment 2025 | ఎన్‌టీపీసీలో భారీగా ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు..
Career

NTPC Recruitment 2025 | ఎన్‌టీపీసీలో భారీగా ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు..

NTPC Recruitment 2025 : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీని ద్వారా మొత్తం 475 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్ల‌య్ చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్పటికే ప్రారంభమైంది,. ఫిబ్రవరి 13, 2025 చివరి తేదీగా నిర్ణయించారు. ఖాళీల వివరాలు: ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి: మెకానిక‌ల్ : 180 పోస్టులు ఎలక్ట్రికల్ : 135 పోస్టులు ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ : 85 పోస్టులు సివిల్ విభాగం - 50 పోస్టులు మైనింగ్ : 25 పోస్టులు విద్యార్హ‌త ...
Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..
Crime

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..

Hyderabad : ఆక‌లితో అల‌మ‌టించిందామె. క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఒక పూట‌ తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు.. ఎవ‌రినైనా డ‌బ్బులు అడ‌గాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వ‌రో అనేది అనుమానమే. దీంతో మాన‌సికంగా కుంగిపోయిన ఆమె ఆక‌లిని త‌ట్టుకోలేక అస్వ‌స్థ‌త‌కు గురైంది. చివ‌ర‌కు నిద్ర‌లోనే తుది శ్వాస విడిచింది. త‌ల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్ల‌కు తోచ‌లేదు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు ఆ అమాయ‌క పిల్ల‌లు. తొమ్మ‌ది రోజుల‌పాటు ఆక‌లితో అల‌మ‌టిస్తూ త‌ల్లి శ‌వంతోనే ఉన్నారు. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క‌ష్టాలు ఎదుర‌య్యాయి ఇలా.. Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివ‌సించేది...
error: Content is protected !!