Sarkar Live

Author: Maulika

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..
Crime

Hyderabad : త‌ల్లి ఆక‌లిచావు.. దిక్కుతోచ‌ని బిడ్డ‌లు.. చివ‌ర‌కు ఏం చేశారంటే..

Hyderabad : ఆక‌లితో అల‌మ‌టించిందామె. క‌నీసం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఒక పూట‌ తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు.. ఎవ‌రినైనా డ‌బ్బులు అడ‌గాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వ‌రో అనేది అనుమానమే. దీంతో మాన‌సికంగా కుంగిపోయిన ఆమె ఆక‌లిని త‌ట్టుకోలేక అస్వ‌స్థ‌త‌కు గురైంది. చివ‌ర‌కు నిద్ర‌లోనే తుది శ్వాస విడిచింది. త‌ల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్ల‌కు తోచ‌లేదు. ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు ఆ అమాయ‌క పిల్ల‌లు. తొమ్మ‌ది రోజుల‌పాటు ఆక‌లితో అల‌మ‌టిస్తూ త‌ల్లి శ‌వంతోనే ఉన్నారు. హైద‌రాబాద్‌లో చోటుచేసుకున్న ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క‌ష్టాలు ఎదుర‌య్యాయి ఇలా.. Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభ‌ర్త‌లు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివ‌సించేది...
Union Budget 2025 | గుడ్ న్యూస్..  రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌
Business

Union Budget 2025 | గుడ్ న్యూస్.. రూ. 12 ల‌క్ష‌లు ఆదాయం ఉన్నా.. నో ఇన్‌కం ట్యాక్స్‌

Union Budget 2025 : మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు, ఉద్యోగుల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభ‌వార్త చెప్పారు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ రోజు పార్ల‌మెంటులో వార్షిక‌ బ‌డ్జెట్ (Union Budget 2025) ప్ర‌వేశ‌పెట్టిన ఆమె ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆశ‌లు నెర‌వేర్చిన కేంద్రం ఇన్‌కం ట్యాక్స్ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతూ వ‌స్తున్నారు. దీంతో కేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకుంది. నిర్మ‌లా సీతారామ‌న్ వరుసగా ఎనిమిదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండ‌గా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే. బడ్జెట్‌పై ఆసక్తిగా పేదలు, మధ్య తరగతి, వేతన జీవులు ఎదురు చూశారు. చివ‌ర‌కు వారి ఆశ‌లు నెర‌వేరాయి. Union Budget 2025 : మ‌ధ్య త‌ర‌గ‌తి క...
Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..
State

Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..

Vehicle Kills Leopard : నీళ్ల కోసం రోడ్డుపై వ‌చ్చిన ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. వేగంగా దూసుకొచ్చిన వాహ‌నం ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లా (Medak district) రామాయంపేటలో నిన్న రాత్రి (గురువారం) చోటుచేసుకుంది. నేష‌న‌ల్ హైవే- 44 (National Highway 44) దాటుతున్న ఆడ‌ చిరుత రోడ్డు ప్ర‌మాదానికి బ‌లైంది. చెక్ డ్యామ్ వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరి.. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన చిరుత (Leopard) వ‌య‌సు 6-7 సంవ‌త్సాలు ఉంటుంద‌ని మెద‌క్ జిల్లా అట‌వీ శాఖ అధికారి ఎం.జోజి తెలిపారు. ఇది మృతి చెందే స‌మ‌యంలో ఆరోగ్యంగానే ఉంద‌ని పేర్కొన్నారు. గతంలోనూ ఈ చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతం, చెక్ డ్యామ్ వద్ద కనుగొన్న‌ట్టు చెప్పారు. వ‌న్య‌ప్రాణులకు తాగునీటి కోసం ఈ చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేయ‌గా అక్క‌డికి అవి వ‌స్తూ పోతాయ‌ని తెలిపారు. ఈ చిరుత కూడా నీళ్లు తాగేందుకు వ‌చ్చే క్ర...
Nagoba Jatara | గిరిజ‌న సంస్కృతికి అద్దం పట్టే నాగోబా జాత‌ర‌.. దీని విశేషాలు ఎంటో తెలుసా..?
Special Stories

Nagoba Jatara | గిరిజ‌న సంస్కృతికి అద్దం పట్టే నాగోబా జాత‌ర‌.. దీని విశేషాలు ఎంటో తెలుసా..?

Nagoba Jatara : తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ (Adilabad district) జిల్లా కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఒక మహా గిరిజన ఉత్సవం నాగోబా జాతర. ఇది గోండు తెగలకు సంబంధించిన వేడుక ఇది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు ఎంతో వైభవంగా దీన్ని నిర్వ‌హిస్తారు. తెలంగాణ (Telangana)లో జరిగే గిరిజన ఉత్సవాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద ఉత్సవంగా నాగోబా జాత‌ర ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో గోండు తెగలకు చెందిన మేస్రం వంశీయులు ప్రధాన భక్తులుగా ఉంటారు. అత్యంత వైభ‌వంగా కొన‌సాగుతున్న నాగోబా జాత‌ర నాగోబా జాత‌ర మంగ‌ళవారం (2025 జ‌న‌వ‌రి 28) అర్ధ‌రాత్రి అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఫిబ్ర‌వ‌రి 4 వ‌ర‌కు కొన‌సాగనుంది. ఈ జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ద‌ర్బార్ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క హాజ‌రుకానున్నారు. Nagoba Jatara విశేషాలు ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించే ఈ మహా ఉత్...
Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు
Crime

Prostitution racket | హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు

Prostitution racket : హైద‌రాబాద్‌లో ఓ అంతర్జాతీయ వ్య‌భిచార రాకెట్ (International prostitution racket)ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. గచ్చిబౌలి (Hyderabad’s Gachibowli)లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి వివిధ దేశాల‌కు చెందిన తొమ్మిది మంది మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముఖ్యంగా కెన్యా, టాంజానియాకు చెందిన మ‌హిళ‌లు ఉన్నారు. ప్ర‌త్యేక టీం దాడులు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ప్రత్యేక ఆపరేషన్ టీం (SOT), స్థానిక పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఈ వ్య‌భిచారం కొన‌సాగుతోంద‌ని గుర్తించారు. ఈ రాకెట్ అంతర్జాతీయంగా విస్తరించి ఉందని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. విదేశాల నుంచి మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి ఈ దందాను న‌డిపిస్తున్నార‌ని తేలింది. ఈ ముఠా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్త‌రించి ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నార...
error: Content is protected !!