Hyderabad : తల్లి ఆకలిచావు.. దిక్కుతోచని బిడ్డలు.. చివరకు ఏం చేశారంటే..
Hyderabad : ఆకలితో అలమటించిందామె. కనీసం ఇద్దరు పిల్లలకు ఒక పూట తిండి అయినా పెట్టలేకపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు.. ఎవరినైనా డబ్బులు అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అడిగినా ఇస్తారో.. ఇవ్వరో అనేది అనుమానమే. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఆకలిని తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. చివరకు నిద్రలోనే తుది శ్వాస విడిచింది. తల్లి మృతితో ఏం చేయాలో ఆమె కూతుళ్లకు తోచలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆ అమాయక పిల్లలు. తొమ్మది రోజులపాటు ఆకలితో అలమటిస్తూ తల్లి శవంతోనే ఉన్నారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కష్టాలు ఎదురయ్యాయి ఇలా..
Hyderabad ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజు, లలిత (45) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాల్లోనే ఈ కుటుంబం నివసించేది...




