Sarkar Live

Author: Maulika

Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌
State

Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌

Industrial Training : నేటి ఆధునిక యుగానికి అనువుగా యువ‌త‌కు ఉద్యోగావకాశాలు, జీవ‌నోపాధి క‌ల్పించే విధంగా శిక్షణ కేంద్రాలు ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావించింది. పాతతరం ఐటీఐల (Industrial Training Institutes (ITIs)కు కొత్త రూపు ఇవ్వాల‌ని సంక‌ల్పించింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ (Advanced Technology Centres (ATCs)గా ఐటీఐల‌ను మార్చింది. Industrial Training : సెప్టెంబ‌రు 27 నుంచి ప్రారంభం అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ ఏర్పాటు త‌న డ్రీమ్‌ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ( Chief Minister A. Revanth Reddy) అంటున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త శిక్షణా కేంద్రాల (modern institutes)ను సెప్టెంబరు 27న హైద‌రాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర...
Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం
State

Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం

Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ ని...
Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం
Crime

Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒక‌రి హ‌తం

Miyapur Murder Case : హైదరాబాద్ మియాపూర్ (Miyapur) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ (rehabilitation centre )లో ఘోర ఘటన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అదే సెంటర్‌లోని ఇద్దరు సహచరుల చేతిలో హ‌త్య‌కు గురైన‌ట్టు వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన సందీప్ మాదక ద్రవ్యాలకు అల‌వాటు ప‌డి (addicted to drug) వ్య‌స‌న‌పరుడిగా మారాడు. దీంతో అత‌డిని కుటుంబ సభ్యులు సుమారు తొమ్మిది నెలల క్రితం హైద‌రాబాద్‌లోని రీహాబిలిటేష‌న్ సెంటర్‌లో చేర్పించారు. మాదక ద్ర‌వాల‌ను వీడి అత‌డు సాధార‌ణ జీవితాన్ని గడుపుతాడ‌ని భావించారు. ఇదే క్ర‌మంలో న‌ల్ల‌గొండ జిల్లా (Nalgonda district)కు చెందిన ఆదిల్‌, హైద‌రాబాద్ బార్క‌స్‌కు చెందిన సులేమాన్ కూడా మూడు నెల‌ల క్రితం ఈ రీహాబిలేష‌న్ సెంట‌ర్‌లో చికిత్స కోసం చేరారు. బుధ‌వారం రాత్రి సందీప్‌తో ఆదిల్‌, సులేమ...
Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం
State, Karimnagar

Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం

Indian Railway News : కరోనా మహమ్మారి సమయంలో నిలిచిపోయిన అనేక రైలు సేవలలో ముఖ్యమైనది ముంబై–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి. ఇప్పుడు ఆ రైలు మళ్లీ పట్టాలెక్కింది. దీని పునఃప్రారంభంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌లు, విద్యార్థులు అందరికీ ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. క‌రోనా తర్వాత రైలు మళ్లీ ప్రారంభం కరోనా (COVID-19) కాలంలో విధించిన పరిమితుల కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. వాటిలో ముంబై - కరీంనగర్ వెళ్లే ఈ రైలు కూడా ఒకటి. ఈ సర్వీస్ నిలిచిపోవడంతో రెండు నగరాల మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. ప్రయాణికుల (passengers) నుంచి నిరంతరం వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ చివరికి ఈ సర్వీస్‌ (Mumbai–Karimnagar)ను మళ్లీ ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ముంబైలో ఉద్యోగాలు చేసే కరీంనగర్ ప్రాంత ప్ర...
ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు బిగ్ షాక్‌ – Betting racket

CID cracks online Betting racket : చ‌ట్ట విరుద్ధ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారం (online betting racket) పై తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (Telangana CID) మెరుపు దాడులు చేసింది. తెలంగాణ కేంద్రంగా న‌డుస్తున్న ఈ దందాపై ఉక్కుపాదం మోపింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్న ఈ భారీ రాకెట్‌పై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ రాకెట్‌ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఆరు యాప్‌ల ద్వారా కోట్ల వ్యాపారం సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితులు ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను తయారు చేసి వాడుతున్నారు. Taj0077, Fairply.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే మొబైల్ యాప్‌ల ద్వారా వేలాది మందిని బెట్టింగ్ ఊబిలోకి దింపారు. తక్కువ ప...
error: Content is protected !!