Sarkar Live

Author: Maulika

Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు
Cinema

Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు

Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మ‌రోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయ‌న‌కు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వ‌ర్మ రిప్ల‌య్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు. Ram Gopal Varma పై న‌మోదైన కేసు ఏమిటి? వర్మ తన 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట...
ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..
Technology

ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..

ISRO New Mission 2025 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం తన 100వ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈ మిష‌న్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఈ శాటిలైట్ ఉంటుంది. ఇస్రో కొత్త చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) నేతృత్వంలో జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఆయన జనవరి 16న బాధ్యతలు స్వీకరించారు. 2025లో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం కూడా ఇదే. GSLV-F15 రాకెట్ దూసుకెళ్లింది ఇలా.. GSLV రాకెట్ బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ISRO విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్ తన పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో విజయవంతంగా విడదీసింది...
New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..
State

New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..

New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌక‌ర్యాల‌తో వీటిని స్థాపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్ల‌డించారు. దీనికి ప్ర‌త్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్ర‌దేశాలను ఎంచుకొని అవసరమైన భూముల‌ను కేటాయించేందుకు ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ముందుకొచ్చిన పెట్టుబ‌డిదారులు కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ఐటీ పార్కుల కోసం న‌గర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూముల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్ర‌దేశాల‌నే ఎంచుకుంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Comp...
UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు
Business

UPI contribution | భార‌త్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు

UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్ల‌వాత్మ‌క వృద్ధి చెందుతోంది. డిజిట‌ల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR - క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విష‌యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్ల‌డైంది. త‌గ్గుముఖం ప‌ట్టిన ఇత‌ర చెల్లింపులు ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సులువైన ప‌ద్ధ‌త...
Andrea Hewitt | ఆయ‌నతోనే ఉండి పోదామనుకుంటున్నా.. కాంబ్లీ భార్య‌ సంచ‌ల‌న కామెంట్‌
Viral

Andrea Hewitt | ఆయ‌నతోనే ఉండి పోదామనుకుంటున్నా.. కాంబ్లీ భార్య‌ సంచ‌ల‌న కామెంట్‌

భారత క్రికెట్ జ‌ట్టు మాజీ క్రీడాకారుడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) భార్య ఆండ్రియా హెవిట్ (Andrea Hewitt) ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వాల‌నుకున్నా గానీ, ఆయ‌న అనారోగ్య స్థితిని చూసి నిర్ణ‌యాన్ని మార్చుకున్నాన‌ని వెల్ల‌డించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆండ్రియా హెవిట్ ఈ కామెంట్లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. వ‌దిలి వెళ్లిపోదామ‌నుకున్నా : Andrea Hewitt ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యాంశీ పాండే నిర్వహించిన ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆండ్రియా హెవిట్ మాట్లాడారు. కాంబ్లీతో వైవాహ‌క బంధానికి స్వ‌స్తి ప‌లకాలని 2023లో విడాకుల కోసం దరఖాస్తు చేశాన‌ని వెల్లడించారు. ఆయ‌న మద్యానికి బానిసైపోవడం తమ వైవాహిక జీవితంపై ఎంత తీవ్ర ప్రభావం చూపిందో వివరించారు. ఆయ‌న ఎలా బ‌తుకుతాడ‌న్న‌దే బెంగ కాంబ్లీని వ‌దిలి వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకొనే దాన్న‌ని, ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా ఆ ప‌ని చేయ‌లేక‌పోయాన...
error: Content is protected !!