Sarkar Live

Author: Maulika

iBomma : క‌రేబియ‌న్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌
Cinema

iBomma : క‌రేబియ‌న్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌

పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్టు iBomma గురించి తెల‌య‌ని సినీ ప్రేమికులు ఉండ‌రు. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ iBomma వెబ్‌సైట్ అక్రమంగా అప్‌లోడ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు సంబంధించిన సంఘాలు అనేక‌మార్లు ఫిర్యాదులు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయినా దీని నిర్వాహకులెవ‌రు.. ఎక్కడ ఉంటారు? అనేది తెలియ‌రాలేదు. చివ‌ర‌కు తెలంగాణ పోలీసులు దీని iBomma ఆట‌కట్టించారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహుడిని క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. iBomma నిర్వాహుడు (iBomma administrator) ఇమ్మ‌డి ర‌వి (Imaddi Ravi)గా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అత‌డిని సీసీఎస్ (Hyderabad CCS police) పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. చాలా కాలంగా కరీబియన్ దీవుల్లో నివసిస్తున్న ర‌వి అక్కడ నుంచే ఈ ఆపరేషన్‌ను న‌డిపిస్తున్నట్లు పోలీసులు గుర్తి...
Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్
Hyderabad

Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌ల షెడ్యూల్ (schedule)ను ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. Local body election : స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌ శుక్రవారం జరిగిన విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఘాటుగానే స్పందించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local body election) ఇంకా ఆల‌స్యం చేయొద్ద‌ని ప్రభుత్వం (state government), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇలాగే నిరవధికంగా వాయిదా వేస్తూ కాల‌యాప‌న చేస్తే చ‌ట్టం అనుమతి ఇవ్వబోదని పేర్కొంది. 6 నెలల్లో తప్పనిసరి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో హైక...
Delhi High Alert |  ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట
National

Delhi High Alert | ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట

Delhi News High Alert : న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న మ‌రో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ వాహనం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్‌లో వున్నాయి. పేలుడులో ఉపయోగించిన హ్యుందాయ్‌ i20 కారుతో పాటు, నిందితులు ఈ ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు పోలీసుల‌ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఐదు ప్రత్యేక ఢిల్లీ పోలీసు బృందాలు వాహనాన్ని వెతుకుతుండగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం ఎర్ర‌కోట‌ మెట్రో స్టేషన్ గేట్ నంబర్​ 1 సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హ్యుందాయ్‌ i20 కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని భీరకమైన పేలుడు సంభవించింది. సమీపంలోని అనేక ...
చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా? అయితే ఇలా కాపాడుకోండి – Winter Skin Care
LifeStyle

చలికాలంలో మీ చర్మం పొడిబారుతుందా? అయితే ఇలా కాపాడుకోండి – Winter Skin Care

Winter Skin Care | చలికాలం వచ్చిందంటే చాలు చర్మం బిగుసుకుపోవడం, పొడిబారడం, దురద.. ఇవన్నీ చాలా మందికి తలెత్తే సాధారణ సమస్యలు. శీతాకాలంలో సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉండటంతో చర్మం తేమను త్వరగా కోల్పోతుంది. దీనివల్ల చర్మం నిర్జలీకరణానికి లోనవుతూ, “వింటర్ ఇచ్” అనే సమస్యకు దారి తీస్తుంది. చర్మంపై చలికాలం ఎలా ప్రభావం చూపుతుంది వైద్యులు చెబుతున్న‌దారి ప్ర‌కారం.. చర్మం బయటి పొర సహజ నూనెలు, కణాలతో ఉంటూ రక్షణ గోడలా పనిచేస్తుంది. కానీ చల్లగాలులు, ఇంటి హీటర్లు ఈ నూనెలను తొలగిస్తాయి. ఫలితంగా తేమ బయటకు పోతుంది. అందువల్ల పొడిబారడం, దురద, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయి.”ఇక ఎక్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సీజన్‌లో సమస్యలు మరింతగా పెరుగుతాయి. వేడి నీటితో స్నానం వద్దు అధిక వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం చర్మానికి హానికరం. వేడి నీరు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది ...
Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు
State, warangal

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు

Sponge Parks in Warangal : త‌ర‌చూ భారీ వర్షాల‌తో మునిగిపోతున్న వరంగల్‌, హన్మకొండ నగరాలు ఇకపై పచ్చని రక్షణ కవచాన్ని పొందబోతున్నాయి. భూగర్భ జలాలను నిల్వ చేస్తూ, వరదలను అడ్డుకునే ‘స్పాంజ్ పార్క్‌’లు నగరపు భవిష్యత్తు పర్యావరణ సమతుల్యతను సాధించ‌నున్నాయి. హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఇటీవ‌ల‌ మోంథా తుఫాను కారణంగా 120 కంటే ఎక్కువ కాలనీలు మునిగిపోయిన నేప‌థ్యంలో , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక సుస్థిర పట్టణ పరిష్కారాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోని వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి “స్పాంజ్ పార్క్‌లు” అనే వినూత్న ప్రాజెక్ట్ ను మొద‌లుపెడుతోంది. స్పాంజ్ పార్క్‌లు వర్షపు నీటిని సహజంగా పీల్చుకుని భూమిలోకి మళ్లించే ప్రదేశాలు. ఇవి నగరంలోని తక్కువ భూమి ఉన్న‌ ప్రాంతాల్లో వరదలను తగ్గించడమే కాకుండా, నీటి నిల్వకు కూడా తోడ్పడతాయి.చ...
error: Content is protected !!