Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Warangal Rains | భారీ వర్షంతో  వరంగల్​ అతలాకుతలం
State, warangal

Warangal Rains | భారీ వర్షంతో వరంగల్​ అతలాకుతలం

జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం మానుకోట, డోర్నకల్​, వరంగల్​ రైల్వే స్టేష‌న్లలో నీటమునిగిన రైలు పట్టాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ త‌ర్వాత‌ వరంగల్‌ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్...
Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..
State, Hyderabad

Montha Cyclone | మొంథా తుఫాన్ ప్ర‌భావం.. తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు..

హైద‌రాబాద్‌, స‌ర్కార్‌లైవ్ : మొంథా తుపాను (Montha Cyclone) ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, పాల‌మూరు జిల్లా వ్యాప్తంగా వాన‌లు విజృంభిస్తున్నాయి. నిన్న‌టి నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద దుందుభి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. దీంతో క‌ల్వ‌కుర్తి – నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈరోజు జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌ను వాయిదా వేశారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన‌లు ప‌డుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్ర...
Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?
Special Stories

Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?

కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిన మిల్లు యాజమాన్యం? రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయం పై అనేక ఆరోపణలు పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసా? తెలియదా ? Hanamkonda | ఆ మిల్లు యాజమాన్యం కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిందా?ప్రభుత్వం సదరు మిల్లుకు పంపిన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు లేనట్లు?కేటాయించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం బహిరంగ మార్కెట్ కు తరలించిందా?లేక అసలు ఆ మిల్లుకు పూర్తిస్థాయిలో ధాన్యమే రాలేదా?అనే ప్రశ్నలు ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో చక్కర్లు కొడుతున్నాయి.హన్మకొండ జిల్లా (Hanamkonda District) గట్లకానిపర్తిలో ఉన్న వినాయక మిల్లుకు ప్రభుత్వం 2024-25 రబీ సీజన్ లో 3225.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం ఆ ధాన్యాన్ని మరాడించి 2160 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు నామమాత్రంగానే ...
Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
Kurnool Accident |  25 మందికి కార‌ణ‌మైన ఘోర దుర్ఘ‌ట‌న ఎలా జ‌రిగింది.?
Crime

Kurnool Accident | 25 మందికి కార‌ణ‌మైన ఘోర దుర్ఘ‌ట‌న ఎలా జ‌రిగింది.?

Kurnool Bus Fire Accident | కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోవ‌డం అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ వోల్వో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసుల సమాచారం ప్రకారం, బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 23 మంది సుక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మిగతా ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏమ‌న్నారు? ఈ ప్రమాదం రాత్రి 2.45 నుంచి 3 గంటల మధ్య జరిగింద‌ని, ఓ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఇంధన మూత తెరుచుకొని నిప్పురవ్వలు తగిలి మంటలు చెలరేగాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్ల‌డించారు.“...
error: Content is protected !!