Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్
Hyderabad

ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్

•ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదు •తెలంగాణలో మావోయిజం అంతమైందని వ్యాఖ్య •గ్రేహౌండ్స్ విభాగంలో భారీ మార్పులు.. 1700 మంది సిబ్బంది బదిలీగంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి తెలంగాణలో ఇకపై "ఫ్రెండ్లీ పోలీసింగ్" అనే విధానానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రజలకు గౌరవం ఇస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రస్తుతం మావోయిజం అంతరించిపోయిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. గ్రేహౌండ్స్ విభాగంలో కీలక మార్పులు చేపడుతున్నామని వెల్లడించిన డీజీపీ, ఆ విభాగంలోని సుమారు 1700 మంది సిబ్బందిని...
State, Hyderabad
•ఏసీబీ వలలో R&B ఈఎన్సీ మోహన్ నాయక్: 11 చోట్ల ఏకకాలంలో సోదాలు! •ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ మెరుపు దాడులు ​•ఇప్పటివరకు రూ.60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు లభ్యం ​•ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అవినీతి తిమింగలం గుట్టురట్టు ​తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్ అవినీతి సామ్రాజ్యంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విరుచుకుపడ్డారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు భారీ సోదాలు చేపట్టారు. ​హైదరాబాద్‌లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువులకు చెందిన మొత్తం 11 ప్రాంతాలలో 16 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ​కట్టల కొద్దీ నోట్లు.. లీటర్ల కొద్దీ మద్యం! ​ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ జాయింట్ డైరెక్టర...
​కోర్టు కేసులో ఉన్న భూమి‘మ్యూటేషన్’  – Illegal Land Mutation
Special Stories

​కోర్టు కేసులో ఉన్న భూమి‘మ్యూటేషన్’ – Illegal Land Mutation

పరకాల తహసీల్దార్‌పై బాధితుల ఆగ్రహం ! ​ ఆర్ఐ, జీపీఓ రిపోర్టులు లేకుండానే పట్టా జారీ? ​సాగు చేయని భూమికి రెవెన్యూ అధికారుల ‘కృప’! ​ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ Illegal Land Mutation | హన్మకొండ జిల్లా పరకాల మండలంలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం బట్టబయలైంది. కోర్టు పరిధిలో ఉండి, క్షేత్రస్థాయి పరిశీలన కూడా లేని ఒక వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, పట్టా పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పరకాల మండలం మాదారం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​అసలేం జరిగిందంటే..? ​స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 665లో గల 16 గుంటల భూమి ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదంలో ఉంది. ఈ భూమిపై కోర్టు కేసు నడుస్తుండటంతో, ఎవరికీ రిజిస...
Corruption | ఇప్పుడేం చేయాలి… తలపట్టుకున్న సర్వేయర్
Special Stories

Corruption | ఇప్పుడేం చేయాలి… తలపట్టుకున్న సర్వేయర్

ప్రకంపనలు సృష్టించిన "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన" కథనం సాధారణ సర్వేయర్ కు ఇన్ని ఆస్తులా అంటూ జోరుగా చర్చ అవినీతి నిరోధక శాఖ నజర్ వేస్తే సర్వేయర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోవాల్సిందే… ​Surveyor Corruption Allegations | "ఇప్పుడేంచేయాలి..?" అంటూ ఆ సర్వేయర్ ఇప్పుడు తలపట్టుకున్నారట.'సర్కార్ లైవ్' వెబ్ సైట్ వెలువరించిన ఒకే ఒక్క కథనం ఇప్పుడు స్థానికంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది.ఒక సాధారణ సర్వేయర్ స్థాయికి మించి, ఊహకందని రీతిలో ఆస్తులు కూడబెట్టారనే అంశం పై "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన " శీర్షికన సర్కార్ లైవ్ వార్త వెలువరించడంతో ఆ వార్త ఇప్పుడు ఎర్రబెల్లిగూడెంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ​సాధారణ సర్వేయర్.. అసాధారణ ఆస్తులు! ​భూముల సరిహద్దులు కొలవాల్సిన సర్వేయర్.. తన సంపాదన సరిహద్దులను ఎప్పుడో దాటేశారనే ఆరో...
​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!
Special Stories

​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!

​విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ ‘విజయ’మే.. ​బినామీల పేరిట కోట్ల సామ్రాజ్యం.. తవ్వేకొద్దీ దిమ్మతిరిగే ఆస్తులు! Surveyor Scam in Hanumakonda​ | ఆయనో సాదాసీదా ప్రభుత్వ సర్వేయర్. భూముల సరిహద్దులు కొలవడమే ఆయన విధి. కానీ, చేతిలో ఉన్న సర్వే గొలుసుతో తన సొంత ఆస్తుల సరిహద్దులను మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు పెంచేసుకున్నారు. విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ సారుకు ‘విజయ’మే లభించిందని, బినామీల పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే గుసగుసలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ​నర్సింహులపేట టూ హన్మకొండ.. ‘కనకవర్షం’! ​నర్సింహులపేట మండలంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, అనతికాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించే స్థాయికి చేరుకోవడంపై స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తు...
error: Content is protected !!