Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..
Crime

Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..

Maha Kumbh Fire : యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభామేళా ప‌రిస‌రాల్లో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ (Mahakumbh Nagar)లోని ఓ శిబిరంలో ఈ రోజు ఉద‌యం ఇది సంభ‌వించింది. అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాక సిబ్బంది బాగా శ్ర‌మ‌కోర్చి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగ‌డం, చుట్టూ ఉన్న ఇతర శిబిరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం? మ‌హా కుంభ్‌న‌గ‌ర్ (Mahakumbh Nagar) లోని సెక్టార్ 18-19 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో మేళా ప్రాంగణంలోని అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం ఏమైనా జ‌రిగిందా? అనే విషయమై అధికారిక సమాచారం అందలేదు. Maha Kumbh Fire కు కారణం ఏమిటి? అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ మేళాల...
Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం
State

Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం

Bird flu cases in Telangana | భారతదేశంలో బ‌ర్డ్‌ఫ్లూ (Avian Influenza) కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో ఇది వ్యాపించ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ (Veterinary and Animal Husbandry) ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. రాష్ట్రంలోని కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో స‌మావేశ‌మై బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై అవగాహ‌న క‌ల్పిస్తోంది. ప్ర‌జ‌ల‌కు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు చేస్తోంది. బ‌ర్డ్‌ఫ్లూ ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర‌మేమీ కాద‌ని, ఎలాంటి భ‌యాందోళన‌కు గురికాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అంటోంది. Bird flu : పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై నిషేధం బ‌ర్డ్‌ఫ్లూ (Bird flu) వ్యాపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోకి కోళ్లు, గుడ్లు, ...
ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…
Special Stories

ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…

రవాణా శాఖ డిటిసి పై ఏసీబీ దాడులు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్లు ప్రచారం..? ACB Raids | తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు యమ స్పీడు మీద ఉన్నారు. చిన్న క్లూ దొరికితే చాలు అక్రమారుల భరతం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రవాణా శాఖలో ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల్లో దాడులు చేసి కొంతమంది అవినీతి అధికారులను జైలుకు పంపించిన అధికారులు.. ఈరోజు ఉదయమే హన్మకొండలోని రవాణా శాఖ (RTA)లోని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్ళల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల హన్మకొండ లోని ఆయనకు చెందిన ఇండ్లలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. కాగా ఇప్పటికే పుప్పాల శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రవాణా శాఖ లో డిటిసి స్థాయి అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా.. ర...
Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు
Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు

Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. హైద‌రాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మ‌హా కుంభామేళాలో భ‌క్తుల‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. భ‌క్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్క‌డ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విష‌యం ఇది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాగ్ (ప్ర‌స్తుత ప్ర‌యాగ్‌రాజ్) న‌గ‌రంలో జ‌రిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవ‌లు అందించారు. కుంభామేళా (Kumbh Mela) ల‌లో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాల‌యాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్‌.ఎ.హుస్సేన్‌, వినోద్ కుమార్ భ‌ట్నాగ‌ర్ అనే ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు. Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కార‌ణాలు? ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...
S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌
National

S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌

S Jaishankar : అక్రమంగా నివ‌సిస్తున్నారంటూ అమెరికా నుంచి భారతీయులను తిరిగి పంపించ‌డం ( deportation of alleged illegal Indian immigrants)పై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (External Affairs Minister S Jaishankar) స్పందించారు. విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న భార‌త పౌరుల‌ను తిరిగి స్వీకరించడం స‌ర్కారు బాధ్య‌త అన్నారు. దాన్ని పాటించ‌క త‌ప్ప‌ద‌న్నారు. జైశంక‌ర్ మొద‌టి ప్రసంగం ఈ రోజు రాజ్యసభ (Rajya Sabha)లో జరిగింది. ఆ త‌ర్వాత లోక్‌సభలో కూడా ఆయ‌న మాట్లాడారు. చ‌ర్చ‌నీయాంశంగా Jaishankar కామెంట్స్‌ అమెరికా (US)లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉభ‌య స‌భ‌ల్లో చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశమైంది. ఏ దేశమైనా తమ పౌరులను చట్టబద్ధంగా పరిరక్షించుకోవడానికి, వారికి సహాయం చేయడానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అదే సమయంలో ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారి విషయంలో...
error: Content is protected !!