Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)
Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.
భారతదే...




