Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సామర్థ్యం పెంపు
Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకుఈ రైలుకు అదనపు కోచ్లను జోడించనుంది. జనవరి 13, 2025 నుంచి అందుబాటులోకి వచ్చాయి. డిమాండ్కు అనుగుణంగా ప్రయాణీకుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్లో మొదట 8 కోచ్లతో 530 మంది ప్రయాణించే వీలు ఉంది. అయితే ఇపుడు 16 కోచ్లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు X లో పేర్కొన్నారు.
"2024 మార్చి 12న ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేసిన సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఆక్యూపెన్సీతో నడుస్తోంది. 8 కోచ్లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) న...




