AI నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి
మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యంత్రి రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. హైదరాబాద్లో కృత్రిమ మేధ (AI) మైక్రోసాఫ్ట్ (Microsoft), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అడ్వాంటేజ్ తెలంగాణ పేరుతో AI ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాలయ భవనాన్ని సీఎం ఈ రోజు (గురువారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర రాజధానిలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన రెండో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ఐటీ రంగ అభివృద్ధిలో ఒక మైలురాయి అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఐటీ దిగ్గజం హైదరాబాద్ నుంచి నూతన ఆవిష్కరణల ద్వారా ప్రపంచ వ్యాప్త సేవలు అందించడం గర్వకారణమన్నారు.
...




