Demolitions : రాజేంద్ర నగర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు
Demolitions in Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ (Endowment Department) భూములు అక్రమణకు గురి కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ (Rajendranagar)లో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతలు చేపడుతున్నారు. . అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్రమణకు గురైనట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు.
భారీగా పోలీసు బందోబస్తు
రూ.400 కోట్లు విలువైన దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్రమించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కబ్జాదారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన అధికారులు పొక్లెయిన్తో అక్రమంగా ...




